మలేషియా:
భారత హాకీ
జట్టు ఒలింపిక్ కు అర్హత
సాధించింది. శనివారం
మొదటి సెమీ ఫైనల్స్ లో దక్షిణ
కొరియా చేతిలో పాకిస్తాన్
2-1గోల్స్
తేడాతో ఓటమి చవి చూసింది.
దీంతో ఒలింపిక్
నిబంధనల ప్రకారం ఆసియా కప్
విజేత జట్టు గనుక ఇంతకు ముందే
ప్రపంచ కప్ బెర్తు దక్కించుకుంటే!
ఈ మెగా టోర్నీలో
అర్హత
టోర్నీగా ..గత
జూన్ జూలై, లలో
నిర్వహించిన హాకీ వరల్డ్
లీగ్ సెమీ ఫైనల్స్ రౌండ్ లో
ఆసియా జోన్ నుంచి అత్యుత్తమ
స్థానాలు పొందిన రెండు జట్లకు
అవకాశం లభిస్తుంది. ఈ
నిబంధన ప్రకారం...భారత్
ఒలింపిక్ కు అర్హత సాధించింది.
అయితే ఆసియా
కప్ లో తిరగులేని ఆట తీరును
ప్రదర్శిస్తున్న భారత్,
ఈ ఉత్సాహం
తోనే రెండో సెమీ ఫైనల్స్ లో
అతిథ్య జట్టు మలేషియాను 2-0
గోల్స్ తేడాతో
చిత్తు చేసింది. ఎనిమిదో
నిమిషంలో భారత్ కి తొలి పెనాల్టీ కార్నర్ లభించగా .... దాన్ని
స్టార్ డ్రాగ్ ప్లికర్ రఘునాథ్
గోల్ గా మలిచాడు. దీంతో
మొదటి అర్థ భాగం ముగిసే సరికి
భారత్ 1-0తో ఆధిక్యం సంపాధించింది.
రెండో సగం
ఆరంభమైన నాలుగు నిమిషాలకే
మరో పెనాల్టీ సంపాదించింది.
కానీ ఈ పెనాల్టీని
భారత్ సద్వినియోగం చేసుకోలేక
పోయింది. ఈ
మ్యాచ్ లో మలేషియా కూడా
పెనాల్టీలను సంపాదించింది.
కానీ భారత్
గోల్స్ కీపర్ శ్రీజేష్ మరో
సారి గోల్స్ ను అడ్డుకున్నాడు.
భారీ విజయం
సాధించిన భారత్, ఆదివారం
దక్షిణ కొరియాతో ఫైనల్లో
తలపడనుంది...
No comments:
Post a Comment