Showing posts with label ప్రపంచం. Show all posts
Showing posts with label ప్రపంచం. Show all posts

Saturday, 14 September 2013

మరణ శాసనమిది....!


మరణ శాసనం మానవ మృగాలకు......
ఇది కావాలి మహిళలకు అభయ శాసనం....
ఆడదని అలుసా....! అది ఎందుకు తెలుసా...
ఈ రాక్షస నర లోకంలో బ్రతకలేవు తెలుసా...!
ఆగ్రహించు వనితా.... అడుగై ముందొరసా....!
ఆపే దమ్మెవడికుంది ...అదినీకు తెలుసా...

ఈ దేశమే ఆడదమ్మ మగవాడెంతమ్మా....
పాలించే కర్కశులను నిలదీసడుగమ్మా...
                                ఇది నాశాసనం.....మీ...

Saturday, 31 August 2013

ఆ ఇద్దరి లో ...గెలుపెవరిది...?


ముంబై: ఐబిఎల్ (ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్) తుది సమరానికి నేడు తెరలేవనుంది. మరి కొద్ది గంటల్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఎన్ ఎస్ సిఎ స్టేడియంలో జరిగే ఫైనల్లో హైదరాబాద్ హాట్ షాట్, అవధె వారియర్స్ అమీతుమి తేల్చుకోనున్నాయి. అయితే తొలి ఐబిఎల్ లీగ్ ఎవరు విజేతగా నిలుస్తారని ప్రేక్షలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టోర్నిలో మొదటి నుంచి ఓటమన్నది తెలియన సైనా నెహ్వాల్ ...ఫైనల్లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగుతోంది. మరో పక్క యువతార సింధూ...సంచలనాలు సృష్టిస్తుండటంతో అవధె వారియర్స్ ను కూడ తక్కువ అంచన వేయలేం.!ప్రపంచ స్థాయి క్రీడా కారులను ఓడించిన సింధూ ..మంచి ఫామ్ కొనసాగిస్తుంది. అయితే ఒక వేళ్ల ఫైనల్లో సింధూ నిరాశ పర్చినా.. పురుషుల సింగిల్స్, డబుల్స్ లో , మంచి ఆటగాళ్లు ఉండటం అవధె వారియర్స్ కు కలిసొచ్చే అంశం..హైదరాబాద్ కు పెద్ద బలం సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్ లో అజయ్ జయరామ్ గెలుపు పైనే హైదరాబాద్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ లో షెమ్ గో, వాహ్ లిమ్ , మిక్స్ డ్ లో తరుణ్ కోనా..గాద్రె ఫామ్ లో ఉండటం హైదరాబాద్ హాట్ షాట్ కి కలిసొచ్చే అంశం. ఇద్దరు స్టార్ క్రీడా కారిణిలు తలపడుతున్న ఈ ఫైనల్, హోరాహోరిగా సాగుతుందనడంలో సందేహం లేదు.. రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుంది.



Thursday, 29 August 2013

'శ్రీ' పై దాదా చలోక్తులు...



కోల్ కతా: ఐపిఎల్-6 లో40 లక్షల రూపాయల మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన శ్రీశాంత్, ఆడబ్బు మొత్తం ఏం చేస్తాడని మాజీ కెప్టెన్ సౌరప్ గంగూలీ అన్నారు..  బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫిక్సింగ్ పై పలు సూచనలు చేశారు. శ్రీశాంత్ ఫిక్సింగ్ పాల్పడ్డాడో! లేదో! తనకు తెలియదని ...ఒక వేళ్ల ఆ పని చేసి ఉంటే నిజంగా మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడ్డారు.శ్రీశాంత్ డబ్బులే లక్ష్యంగా పెట్టుకుంటే ఒక్క టెస్టు ఆడితే ఆ మొత్తం వస్తుందన్నాడు. మూడు టెస్టుల మ్యాచ్ లో ఇరవై వికెట్లు తీసి ఉంటే దానికి డబుల్ రెట్లు డబ్బు వచ్చేదని తెలిపాడు. మరో వైపు ఫిక్సింగ్ వ్యవహారం భారత క్రికెట్ ను దెబ్బ తీయదని అన్నాడు... ఒక చెరువులో , లేదా ఒక నదిలో మంచి చేపలు ఉంటాయి... చెడు చేపలు ఉంటాయి... కానీ చెడు చేపల వల్ల ఆ నది మొత్తం పాడు కాదు కదా....!అని తెలిపారు. అదేవిదంగా భారత్ క్రికెట్ వ్యవస్థలో చాలా మంది మంచి వారు ఉన్నారు. చెడ్డ వారు ఉన్నారు. అంత మాత్రాన క్రికెట్ వ్యవస్థ దెబ్బ తినదని అభిప్రాయపడ్డారు.    

Wednesday, 28 August 2013

మువ్వన్నెలను ముద్దాడిన క్రీడా కారులు...


హైదరాబాద్: భారత దేశం! మువ్వన్నెల జండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన ఎందరో క్రీడా కారులున్నారు. నాటీ హాకీ మాంత్రికుడు, థ్యాన్ చంద్ నుంచి ఇప్పటి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో ఎందరో వీరులను కన్నది మన పుణ్య దేశం...!కానీ థ్యాన్ చంద్ తరువాత ఇప్పటికి భారత హాకీ జట్టులో మరో థ్యాన్ చంద్ లాంటి ఆటగాడు లేకపోవడం దురదృష్ట కరం..!అంటే నేటి రాజకీయ క్రీడాల్లో ....దేశ క్రీడలు ఏవిదంగా శాషిస్తున్నాయో తెలుసుకోవచ్చు..!ఏక చక్రాదిపత్యంగా భారత్ ను మూడు సార్లు స్వర్ణాలు ముద్దాడిన థ్యాన్ చంద్, ఆయన పుట్టిన రోజు ప్రతి ఏట ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినవారిని సన్మానిస్తారు. మన భారత ప్రభుత్వం. అయితే భారత్ ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశం. కానీ ప్రపంచ క్రీడా రికార్డుల ప్రకారం ఎంతో వెనుక బడి ఉంది. 1928 ఆస్టర్ డ్యాం నుంచి ఇప్పటి వరకు కేవలం హాకీ ద్వార మాత్రమే భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. మరో వ్యక్తి గత విభాగాల్లో సైతం స్వర్ణ పథకాలు సాధించే స్థాయికి ఎదిగింది. అయితే వంద కోట్లకు పైగా భారత పౌరులున్నా...కేవలం అతి తక్కువ మంది క్రీడా కారులు మాత్రమే భారత దేశానికి పేరు  ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.
మతంగా క్రికెట్.....!
క్రికెట్ పుట్టింది ఇంగ్లాండులో అయితే దాన్ని హక్కున చేర్చుకుంది మాత్రం భారత్, ఎందుకంటే తొలిసారిగా భారత్ 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచ కప్ ను ముద్దాడింది. అప్పటి నుంచి ఇండియాలో క్రికెట్ పై మక్కువ ఏర్పడింది. ఇప్పటి వరకు దాన్ని ఓ మతంగా ఆరాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు....
మువ్వన్నెలను ఎగుర వేసిన 'మాంత్రికుడు'...
అయితే మన జాతీయ క్రీడా హాకీ, ఒలింపిక్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు తొమ్మిది బంగారు పథకాలు సాధిస్తే... అందులో కేవలం హాకీ ద్వారా వచ్చినవి మూడు.అంటే అప్పట్లో హాకీ మాంత్రికుడు ఎంత మాయ చేశాడో అర్థం అవుతుంది. భారత హాకీ ని భారత ఆటగాడు థ్యాన్ చంద్ ను వేరిచేసి చూడటం సాధ్యం కాని పని , థ్యాన్ చంద్ దేశానికి చేసిన ఎనలేని సేవను గుర్తిస్తు ప్రతి ఏట థ్యాన్ చంద్ పుట్టిన రోజున ఆగస్టు 29న దేశ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున రాజీవ్ కేల్ రత్న, ద్రోణా చార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులతో క్రీడా కారులను సన్మానిస్తారు.
క్రికెట్ పై ఆదరణ....
అయితే భారత్ లో ఎక్కువగా ఆదరిస్తున్న క్రీడా క్రికెట్ మాత్రమే ...! భారత్ తొలి కెప్టెన్ తెలుగు తేజం సికే నాయుడు నుంచి ప్రపంచ కప్ ను సాధించి పెట్టిన కపిల్ దేశ్ , సునీల్ గవాస్కర్, అనీల్ కూంబ్లే, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, ధోనీ, విరాట్ కోహ్లీ ఇలా ఎందో ఆల్ టై గ్రేడ్లను అంధిచిన ఘనత భారత్ కు దక్కుతుంది. అయితే క్రికెట్ ఎంత మంది యువ ఆటగాళ్లు వచ్చినా...! అందరు సచిన్ తరువాతే నని చెప్పుకోవాలి. మన దేశంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ దేవుడిగా కొలుస్తారు. ఇంకా చెప్పాలంటే సచిన్ భారత్ క్రీడా రంగానికే ఓ ఐకాన్ ప్లేయర్ గా వెలుగు వెలిగుతున్నాడు. తన ఆట తో అంతగా మాయ చేశాడు ఈ లిటిల్ మాస్టర్, సచిన్ ప్రపంచ బ్యాట్ మెన్స్ లో ఓ నెంబర్ వన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అంతే కాదు భారత్ కు ప్రపంచ కప్ అందించాలని కలలు కన్నాడు... పరితపించాడు... సుదీర్ఘ కాలం పాటు వేచి చూశాడు..! చివరికి 2011లో తన కల సకారం చేసుకున్నాడు... , కలలు కనండీ ..వాటిని సాకారం చేసుకోవడానికి పరితపించడండీ... అని సచిన్ ప్రపంచానికి చెప్పకనే చెప్పాడు..!తన ఆట తీరుతో ఎందరో అభిమానులను చొరకొన్న సచిన్, తరువాత అంతటి పేరు ప్రత్యేకతలు సంపాధించాడు.. కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ...ఇతను ఇండియాను రెండు ఫార్మాట్ లల్లో విశ్వ విజేతలు నిలిపాడు. టెస్టుల్లో ఇండియాను నెంబర్ వన్ ర్యాంక్ కు చేర్చిన ఘనత అతనికే సొంతం!

ఒలింపిక్ దీరులు...
అయితే వ్యక్తి గ విభాగాల్లోను భారత్ ను విశ్వ విజేతలు గా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. చెస్ విభాగంలో విశ్వనాద్ ఆనంద్ ఇప్పటి వరకు ఐదు సార్లు ప్రపంచ కప్ లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. ఇక బ్యాడ్మింటన్ లో ప్రకాశ్ పడుకునే ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.. ఆదరణ ప్రోత్సాహం ఏ మాత్రం లేని రోజుల్లోనే 1980లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్న క్రీడా కారుడిగా చరిత్ర సృష్టించారు. అంతే కాదు ప్రకాశ్ ఓ వరల్డ్ కప్ టైటిల్ ను సాధించి పెట్టారు. బ్యాడ్మింటన్ లో ఇప్పటి వరకు ఎందరో బ్యాడ్మింటన్ లు వస్తున్నారు. పోతున్నారు. కానీ ప్రకాశ్ పదుకునే లాంటి వారు ఇప్పటికి దేశానికి దొరకలేదు. అయితే 28ఏళ్ల తరువాత భారత దేశానికి బంగారు పథకం అంధించి అరుదైన రికార్డు సృష్టించాడు అభినవ్ బింద్ర, 2008 బీజింగ్ ఒలింపిక్ లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భింద్రా గోల్డ్ మెడల్ సాధించాడు.. ఇప్పటి వరకు భారత దేశం మొత్తం 29పథకాలుమాత్రమే సాధించ కలిగింది. ఇందులో 9 బంగారు పథకాలు, ఆరు వెండి పథకాలు.11కాంస్య పథకాలు ఉన్నాయి . ఇక ఒలింపిక్ టెన్నిస్ పురుషుల విభాగంలో లియాండ్ ఫేస్ కాంస్య పథకం సాధించాడు. 2000సిడ్నీ  ఒలింపిక్స్ లో మనతెలుగు తేజం కరుణం మల్లీశ్వరీ వేయిట్ లిఫ్టింగ్ విభాగంలో పథకం సాధించింది. 2012 భారత్ ఒలింపిక్స్ లో భారత్ ఏకంగా ఆరు పథకాలు సాధించింది. భారత దేశానికి వచ్చిన అత్యదిక ఒలింపిక్ పథకాలు ఇవే కావడం విషేశం..
కబడ్డీ హవా....

ఇక మన దేశంలోనే పుట్టిన కబడ్డీ హవా కొనసాగుతోంది. కబడ్డీలో నెంబర్ వన్ మన భారత జట్టే..!2004నుంచి 2012వరకు జరిగిన ఐదు ప్రపంచ కప్ టైటిల్స్ ను మన దేశమే సొంతం చేసుకుంది. ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. 2012లో వరల్డ్ కప్ ను సైతం భారత జట్టే సొంతం చేసుకుంది. ఇక బిలీయర్డ్స్ లోని భారత్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పేరు వింటే గుర్తుకొచ్చే క్రీడా కారుడు పంకజ్ అద్వానీ , ఇప్పటి వరకు రికార్డు లెవల్లో పంకజ్ అద్వాని ఏడు సార్లు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అశ్వని నాచప్ప.. పేరు తెచ్చిపెట్టారు... ఏది ఏమైనా కొంత మంది క్రీడా కారులు మాత్రం..భారత్ పేరు ప్రతిష్టలు నిలబెడుతూ వస్తున్నారు...... ఆగస్టు 29ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇక నైనా మన దేశంలో క్రీడా అభివృద్ది సాధించాలని అశిద్దాం.................. మీ ....!
 

Sunday, 21 July 2013

భార్యను కడతేర్చిన భర్త

శ్రీకాకుళం: భార్యను కడతేర్చి మృత దేహాన్ని కాలువలో పడేసిన ఘటన సంతకవిటి మండలంలో చోటుచేసుకుందివివరాల్లోకి వెళ్తే...కాకరాపల్లిలో నివాసముంటున్న అనంతరావు శనివారం సాయంత్రం భార్యను చంపి మృత దేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియని అమాయకుడిలా తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడుఅయితే అతనిపై ముందునుండి అనుమానంతో ఉన్న గ్రామస్తులుబంధువులుతన వ్యవహార శైలి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు అనంతరావే ఈ హత్య చేశాడని తేల్చారు. దీంతో అతనిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, గ్రామ ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఐదేళ్ల బాలికపై వృద్దుడు అత్యాచారం

ఆదిలాబాద్‌ అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడుస్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన భైంసా పట్టణంలో ఆదివారం జరిగిందిపోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని భైంసా పట్టణంలో కొర్వగల్లీకి చెందిన షేక్‌ మానామ్‌ అనే 70 ఏళ్ల వృద్ధుడు అదే కాలనీకి చెందిన ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడుబాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారుపోలీసులు కేసు నమోదు చేసుకుని షేక్ మానామ్‌ను అదుపులోకి తీసుకున్నారు