Wednesday 7 May 2014

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం కానుక

ఢిల్లీ: యూపీఏ-2 ప్రభుత్వం చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల విద్యా భత్యం సహా కొన్ని గ్రాంట్లను పెంచింది. విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు రూ.1,500) చేస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.12,000గా ఉంది. వైకల్యం ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు ప్రత్యేక భత్వం ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి ఉండగా దాన్ని రూ.1,500చేశారు. వైకల్యం ఉన్న పిల్లల విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.36,000 చేశారు. సవరించిన మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తాయి.


కటక్ లో చెన్నై కటకట...!

కటక్: ఐపిఎల్-7లో భాగంగా పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది.44పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసకర మ్యాక్స్ వెల్ మరో సారి తన ప్రతాపాన్ని చూపించడంతో మొదటగా పంజాబ్ నిర్ణీత 20ఓవర్లకు 231పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 38బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఎనమిది సిక్సర్లతో 90పరుగులు చేసి తన విశ్వరూపం చూపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ (30), మిల్లర్ (47), బేయిల్ (40) రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. 232పరుగుల అతి పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ఆ జట్టు తొలి వికెటు కోల్పోయింది. డూప్లీయస్ ఒక్కడే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ రాణించక పోవడంతో 187పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో జాన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. 90పరుగులు ఒక్క వికెట్ తీసిన మ్యాక్స్ వెల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

Tuesday 25 February 2014

/home/media10/Downloads/Unconfirmed 945081.crdownload
/home/media10/Downloads/Osmania-University-BA-BCom-BSc-BSW-I-II-III-Yr-March-2014-Annual-Exam-Time-Table (8).pdf/home/media10/Downloads/Osmania-University-BA-BCom-BSc-BSW-I-II-III-Yr-March-2014-Annual-Exam-Time-Table (8).pdf

Monday 10 February 2014

ముంచుకొస్తున్న మూడో అడుగు...!

 
దేశంలో రెండు పెద్దపార్టీలతో సామన్యుడు విసిగిపోయాడు. దీంతో తనకు లాభం చేకూర్చే మూడో ప్రత్యామ్నాయ పార్టీల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఎ, బిజెపి నాయకత్వంలోని ఎన్టీయే ల కోటలు బీటలు వారుతుండటంతోమూడో ఫ్రంట్ హడావుడి మళ్లీ మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,మూడో ప్రత్యామ్నాంయం మాట అనగానే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ముచ్చట్లు ఊపందుకున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీ ను కూలదోసే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అనే ఆలోచనలో థర్డ్ ఫ్రంట్ నిమగ్నమైంది. అయితే 1991 నుంచి కూడా దేశంలో కాంగ్రెస్, బిజెపి సహాయం లేకుండా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వాతావరణం ఉంది. కేంద్రంలో అధికారం కావాలనుకుంటే ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానితో చేయి కలపాల్సిందే. ఇటీవల కొన్ని పార్టీలు ఈ రెండు కూటముల నుంచి దూరం జిరిగాయి దానికితోడు వామపక్షాలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలు అంధించాలనే తపనతో థర్డ్ ఫ్రంట్ కు వామపక్షాలు నాయకత్వం వహిస్తాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఒడిశా, అసోంలలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ అధికారంలో ఉంది. అసోంలో అసోం గణపరిషత్ ప్రతిపక్షంలో ఉంది. ఈ రెండు పార్టీలు మాత్రం మూడో ఫ్రంట్‌లో చేరేందుకు ముందుకువస్తాయి. ఒడిశాలో కాంగ్రెస్ ప్రతిపక్షం అయితే, బీజేపీ ఉనికి నామమాత్రమే.

మహారాష్ట్రలో కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్; బీజేపీ-శివసేన కూటాలు బలంగా ఉన్నాయి. అంటే మూడో ఫ్రంట్ వైపు చూసే శక్తులేవీలేవు. రాజ్ థాకరే తన ఎంఎన్‌ఎస్ పార్టీని మూడోశక్తిగా రూపొందిస్తాడన్న ఆశ లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరెడి బ్యాటరీ లాగా అన్ని ఫ్రంట్‌లకు పనికొస్తాడు. రాష్ట్రంలో చంద్రబాబు మునుపటంత శక్తిమంతుడు కాకపోవడంతో, ఆయన మూడో ఫ్రంట్ ముచ్చట్లకు అంతగా ఊపు రావడం లేదు. అయితే, బాబు మూడో ఫ్రంట్ ఏర్పాటుకు బాగా శ్రమదానం చేయగలడు. కాంగ్రెస్, టీడీపీ కాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)- ఈ రెండు ప్రాంతీయ పార్టీల హవాయే ఇప్పుడు గట్టిగా వీస్తోంది. కానీ, ఈ రెండు పార్టీలు బాబు ఉండే ఫ్రంట్‌లో చేరే అవకాశం లేదు. అందువల్ల బాబుతో పాటు ఇక్కడ ఏ పార్టీ మూడో ఫ్రంట్ వైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే.

గణాంకాల సంగతి

కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్రాలలో దాదాపు 320 మంది ఎంపీలుంటారు. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రాబల్యం తక్కువ కాబట్టి ఈ రెండు పార్టీ లకు 80 సీట్లకు మించిరావడం కష్టం. ఇక మిగిలిన 220 సీట్లు మూడో ప్రత్యా మ్నాయానికే వస్తాయి. ఒడిశా, బెంగాల్, ఆంధ్రఫ్రదేశ్, తమిళనాడులలో బీజే పీకి ఎంపీ సీట్లు దక్కే అవకాశంలేదు. ఇలాగే, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌కు వచ్చేవి నామమాత్రమే.

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలలో దాదాపు 200 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే, 320 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్, బీజేపీల ప్రాబల్యం బాగా తక్కువ. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతూ ఉంటాయి.

ప్రత్యామ్నాయానికి సాధ్యాసాధ్యాలు

ప్రస్తుతానికి ఎటు తేల్చుకోని ములాయంసింగ్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, చంద్రబాబు ఈ మధ్య మూడో మంత్రం ఉచ్చరిస్తున్నారు. వీళ్లెవరూ బీజేపీతో, కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు. బీజేపీకి ఎన్నికల ఎదురుదెబ్బలు తగలడంతో ఈ మధ్య వీరికి కాషాయం కషాయంగా అనిపిస్తుంది. ఇదే విధంగా నవీన్ పట్నాయక్, జయలలిత కూడా ఏ కూటమి వైపు మొగ్గకుండా కొనసాగాలను కుంటున్నారు. తమ తమ రాష్ట్రాలలో ఈ నాయకులకు మరొక పార్టీతో పొత్తు అవసరంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే అలాంటి తాహతు ఉంది.

దాదాపు 300 స్థానాలలో బలంగా ఉన్న మూడో ఫ్రంట్ పార్టీలకు కనీసం 200 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్, బీజేపీల బలం కంటే ఎక్కువే కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నుంచి మూడో ఫ్రంట్‌కే మొదటి అవకాశం వస్తుంది. ఎన్నిలకు ముందు ఒక కూటమిగా తయారైతే, ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం తమకేవస్తుందని ఈ నాయకులంతా భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఈ అర్హత సంపాదించడం అన్ని పార్టీల లక్ష్యంగా ఉంటుంది. ఇటీవలి సంప్రదాయం ప్రకారం, ఏ పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే, రాష్ట్రపతి నుంచి పిలుపు ఆ పార్టీకి లేదా కూటమికి వస్తుంది.

కాంగ్రెస్ నితీష్‌ను రోజూ ఆకాశానికెత్తడం, జార్ఖండ్ ముక్తిమోర్చాతో మళ్లీ మాట కలపడం కూడా ఇందుకే. ఒక ముఖ్యమైన భాగస్వామి నితీష్‌ను దూరం చేసుకుని బీజేపీ బలహీనపడింది. బీజేపీ కూటమిలో ఇప్పుడు శివసేన, అకాలీ దళ్ తప్ప మరొక పార్టీలేదు. హర్యానాకు చెందిన ఓమ్‌ప్రకాశ్ చౌతాలా, అసోం గణపరిషత్, జార్ఖండ్ ముక్తిమోర్చా, డీఎంకే ఇలా దూరమైనవే. కొత్త పార్టీలేవీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగాలేవు. ఈ లోటు భర్తీ చేసుకునేందుకు బీజేపీ ఇప్పుడు నరేంద్రమోడీని ఊరూరా ఊరేగించేందుకు సిద్ధమవుతూ ఉంది. వచ్చే ఎన్నికలలో పూర్తి ఆధిక్యత రాకపోయినా, అందరికంటే పెద్ద పార్టీ అర్హత వస్తే చాలు, రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుతుంది. అందువల్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి పోటీ ఉన్న 200 స్థానాలలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు బీజేపీ మోడీ ప్రయోగానికి పూనుకుంటోంది. ఈ స్థానాలలో వెనకబడితే, పార్లమెంటులో అతిపెద్ద పార్టీ హోదా దక్కే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోతుంది. బీహార్, బెంగాల్, అసోం, ఒడిశాలలో మోడీ చెల్లని కాసే అయినా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మోడీ మ్యాజిక్ పనిచేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా యుద్ధాలన్నింటినీ పుర్తిగా గెలవాల్సిన పనిలేదు. శత్రువు ముందుకు కదలకుండా ఆపగలిగితే చాలు యుద్ధం గెలిచినట్లే. కొన్ని కీలకమైన రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలితే ఆ పార్టీకి అతిపెద్ద పార్టీ హోదా గల్లంతవుతుంది. అందువల్ల 2014లో ప్రధాన పోటీ ఉండేది కేవలం 200 స్థానాలలోనే.

200 స్థానాలూ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించేవే. ఈ స్థానాలలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తే మూడో ఫ్రంట్ ముందుకొస్తుంది. మూడో ఫ్రంట్, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుంది. రాష్ట్రపతి మూడో ఫ్రంట్‌ను ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆహ్వానిస్తే బీజేపీకి అభ్యంతరంలేదు. ఎందుకంటే, ఈ ఫ్రం ట్‌తో లావాదేవీలు కష్టంకాదు. వీలుంటే, కనీస ఉమ్మడి ప్రణాళికతో మూడో ఫ్రంట్‌లో తానూ భాగస్వామి కావచ్చు. లేదా బయట నుంచి మద్దతేనిచ్చి కాం గ్రెస్‌ను తరిమేయవచ్చు. బీజేపీ వ్యూహం మూడో ఫ్రంట్‌కే ప్రయోజనం. ఇక తన సెక్యులర్ ‘అజెండా’ను ముందుకు తీసుకుపోయేందుకు, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా మూడో ఫ్రంట్‌కే మద్దతివ్వాల్సివస్తుంది. కాబట్టి కాంగ్రెస్‌కు కమలం ఒక బూచిలా కనపడేట్లు చేయడం మూడో ఫ్రంట్ నేతల విధి. మోడీ రాకతో కూడా ఈ పని సులవ వుతుంది. మోడీ భయం వల్ల కాంగ్రెస్ అనివార్యంగా మూడో ఫ్రంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయదు.

Saturday 8 February 2014

మరో స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిన సమయమిది.!

హైదరాబాద్: నేడు రాజకీయాలు బురదలో చిక్కుకున్న పందిలా దయారయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం...!పరదేశ పరాయణత్యం అన్న శ్రీశ్రీ చందంగా ఉంది నేడు దేశ రాజకీయాలు. వార్డు నెంబర్ నుంచి ప్రధాన మంత్రి పదవి వరకు దోచుకోవడమే పనిగా పెట్టుకుని తన రాజకీయ మనుగడను సాగిస్తున్నారు. ఈలాంటి రాక్షస రాజ్యంలో పేదల ఆకలి తీరేదెప్పుడు...! మనకు స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆకలి ! ఆకలి అంటూ పేదవాడి అరుపులు ఆగలేదు. మరెప్పుడు ఈ 65ఏళ్ల స్వతంత్య్ర భారతం ప్రగతి పథంలో దూసుకుపోయేది. మరెప్పుడు యువత కళ్లల్లో ఉద్యోగ క్రాంతి కనబడేది.
ప్రజా సామ్యం పై నమ్మకం పోయింది....!
రాజకీయ పార్టీలపై నేటి యువత పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉండాలని నేటి యువత ఆలోచన! అయితే స్వాతంత్య్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాటీ యువత అల్లూరి సీతా రామరాజు, భగత్ సింగ్ లాంటి వారు అప్పట్లో యువతను మెల్కోల్పారు. కానీ నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలంటే అంటరానివిగా చూస్తున్న వారి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే గొద్దిగా మార్పు వస్తుంది. ఈ రాజకీయాలను మార్చే శక్తి తమకే ఉందని గ్రహించిన యువత మరో స్వాతంత్ర్యానికి పూనుకోవాల్పిన అవసరం ఎంతైనా ఉందని వారు భావిస్తున్నారు.
యువతను టార్గెట్ చేసిన పార్టీలు
తమ పార్టీల దశా దిశను మార్చేది యువతనే అని గ్రహించిన పార్టీలు ఇప్పుడు ప్రధాన దృష్టి యువతపైనే పెట్టింది. సాధ్యమైనంత వరకు యువతను ఆకట్టుకునే విధంగా ప్రకటనలు చేస్తుంది. నిన్నటికి మొన్న దేశ రాజకీయాలకు బయం పుట్టించిన ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు పార్టీలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. 2014లో ఏ విధంగానైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్న బిజెపి, నరేంద్ర మోడి ఇమేజ్ ను కూడకట్టే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆచితూచి స్పంధిస్తుంది. ఈ రెండు ప్రధాన పార్టీల సంగతి ఈ విధంగా ఉంటే ప్రాతీయ పార్టీలు ఈ సారి మాత్రం సత్తా చాటాలని ఉవ్విర్లూరుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్, బిజెపి లకు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలైనా థార్డ్ ఆప్షన్ గా ఉంటే యువత మాత్రం అక్కడ మొగ్గుచూపుతుందని చెప్పవచ్చు.
ప్రధానం కానున్న సోషల్ మీడియా...!
నేటి యువత 47శాతం సోషల్ మీడియాని భాగా వాడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాని ప్రచార మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. నిన్నటికి నిన్న దేశ రాజధానిలో కొత్త చరిత్ర లిఖించింది యువతే అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఈ నాటి రాజకీయాల్లో కొత్త అధ్యయనం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన వారంతా యువతే కావడం మనం గమనించాలి. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ప్రచారం చూస్తే, వారి విజయం యువతలో మరింత ఆశలు పెరుగుతున్నాయి. ఇలాంటి యువత వట్టి పోకూడదు. ఓటేనే బ్రహ్మాస్త్రంతో నవ చరిత్ర సృష్టించాలి.
కాలయాపన మానండీ ....!కాలాన్నితిరగరాయండీ..!
నేటి యువతకు లైఫ్ అంటే సెలబ్రేషన్. క్లబ్ లు, పబ్ లు సినిమాలు, షికార్లు, టీవి ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం . మారుమూల పల్లెలకి ఈ వాతావరణం వచ్చేసింది. తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్పోన్ ఉండటం సాధారనమైపోయింది. కానీ ప్రజల్లోకి , ప్రజా సమస్యల్లోకి చొచ్చుకుపోయింది మాత్రం లేదు..

కుళ్లు పట్టిన రాజకీయాలను కడగేయాల్సింది మనమే...!కళ్లు తెరిచి దేశ భవిష్యత్తును లిఖించాల్సింది మనమే..!

Thursday 12 December 2013

దేశ భవిష్యత్తే యువత....!


ఛీ... ఈదేశాన్ని మార్చలేము...! ఈ రాజకీయ నాయకులను మార్చలేము..! మనకెందుకురా బాబు ఈ రాజకీయాలు....!మన పనేందో మనం చూసుకుందాం..! ఇది తరుచుగా వినిపించే మాటలు... రాజకీయాలపై , దేశ అవినీతి పై విసుగు చెందిన వారు తరుచు మాట్లాడే మాటలు...! కానీ ఇక ముందు ఆ మాటలు రావేమో... దేశ భవిష్యత్తును శాషించే ఆయుధాలు రానున్నాయి... అవే యువ ఓటర్స్.... అవునూ ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15వేల కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి కొత్త గా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు...!నిద్రలేచిన మొదలు ట్విటర్లు, ఫేస్ బుక్ లతో బిజీగా గడిపే ఈ యువతరం తమ అమూల్యమైన ఓటుతో దేశభవిష్యత్తును తిరగ రాయనున్నారనడంలో సందేహం లేదు.!అయితే చుట్టు రాజకీయ వాతావరణం గమనిచంలేని ఈ యువతరం ఎక్కువగా ఎక్కడ ఆకర్షితులవుతారన్నది ముఖ్యం...!
చరిత్ర తిరగ రాయగలరా...!

యువతరం తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు...!ఇది అనేక దేశ చరిత్రలో కూడా కనిసిస్తుంది. నెత్తురు మండే శక్తులు నిండిన ఈ కుర్రాళ్లు...అవినీతికి ప్రత్యామ్నాయంగా నిలుస్తారు..! అయితే మన దేశంలో ప్రతీ ముగ్గురులో ఒక యువకుడున్నాడు. అంటే రాబోయో రోజుల్లో దేశం యువ దేశంగా మారనుంది . దీంతో సగటు భారతీయుని వయస్సు 29ఏళ్లు కానున్నాయి. దీంతో 2014లో దేశ భవిష్యత్తును రాజకీయ నాయకుల తలరాతలను మార్చేది మాత్రం యువతే అని చెప్పవచ్చు.... దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి... ఢిల్లీలో మాత్రం ఈ ప్రభావం మరీ ఎక్కువగా పడింది. నిర్భయ ఉదంతం... పెరిగిన ధరలు యువ ఓటర్లను భాగా ప్రభావం చూపాయి...

Sunday 10 November 2013

క్రికెట్ పిచ్చోడు...



ముంబై: ఇండియా మ్యాచ్ లంటే అభిమానులు మొత్తం స్టేడియంలో కిక్కిరిసి పోతారు....! బంతి వికెట్ ను గిరాటేసినా..... బ్యాట్ బంతిని బాదినా స్టేడియం మొత్తం అభిమానుల హంగామా....అరుపులు చూస్తాం....! ఈ హంగామా, అరుపుల మధ్య ఓ క్రికెట్ పిచ్చోడు! ఒంటి నిండా జాతీయ జెండా రంగు...!చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా! ప్రతీ షాట్ కి అతని చేతిలో జెండా రెపరెపలాడుతోంది... వికెట్ పడ్డప్పుడు...అదే జెండా నింగిలో సాలామ్ చేస్తుంది.... భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా ఆ పిచ్చోడు ఆ స్టేడియంలో ఉంటాడు.... అతనే సుదీర్ చౌదరి....సచిన్ వీరాభిమానైన ఇతను భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు. ప్రతీ మ్యాచ్ ను ఆస్వాదిస్తాడు... ఆనందిస్తాడు.. మ్యాచ్ ఓడినప్పుడు కుంగిపోతాడు.
ఖర్చుమొత్తం అతనే....!
అయితే భారత మ్యాచ్ లంటే టికెట్లు దొరకవు, పైగా స్వదేశంలో అంటే అస్సలు దొరకవు . మరీ ఇతనికి ఏ విధంగా టికెట్ దొరుకుతాయని అందరికి సర్వసాధారణంగా డౌట్ వస్తుంది... అవును ఇతను ఎక్కడికి పోయినా ఆ ఖర్చును మొత్తం సచిన్ టెండూల్కర్ భరిస్తాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఉన్నా లేకున్నా సుదీర్ చౌదరి మాత్రం స్టేడియంలో ఉంటాడు.. ఇతనికి ప్రయాణ ఖర్చులు, స్టేడియం టికెట్ ఖర్చులు, మొత్తం సచిన్ చూసుకుంటాడు. దీంతో భారత మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వింత వింత విన్యాసాలతో తనకున్న క్రికెట్ అభిమానాన్ని చాటుకుంటూ అప్పుడప్పుడు కెమరాకు క్లిక్ మనిపిస్తాడు.
నిద్రలేని రాత్రులు....

ప్రపంచ కప్ భారత్ గెలవాలని కలలు కన్నాడు సుదీర్ చౌదరి. కపిల్ సారథ్యంలో వచ్చిన కప్ మళ్లీ ఈ సారి భారత్ వశం కావాలని కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా కప్ గెలవాలని తన నెత్తిపై కప్ ఆకారంలో కటింగ్ చేయించుకున్నాడు... క్రికెట్ పై , దేశం పైఉన్న అభిమానమే తనను ఈ విధంగా చేయిస్తుందని చౌదరి చెప్తున్నాడు