Wednesday 7 May 2014

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం కానుక

ఢిల్లీ: యూపీఏ-2 ప్రభుత్వం చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల విద్యా భత్యం సహా కొన్ని గ్రాంట్లను పెంచింది. విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు రూ.1,500) చేస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.12,000గా ఉంది. వైకల్యం ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు ప్రత్యేక భత్వం ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి ఉండగా దాన్ని రూ.1,500చేశారు. వైకల్యం ఉన్న పిల్లల విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.36,000 చేశారు. సవరించిన మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తాయి.


No comments:

Post a Comment