Wednesday 7 May 2014

కటక్ లో చెన్నై కటకట...!

కటక్: ఐపిఎల్-7లో భాగంగా పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది.44పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసకర మ్యాక్స్ వెల్ మరో సారి తన ప్రతాపాన్ని చూపించడంతో మొదటగా పంజాబ్ నిర్ణీత 20ఓవర్లకు 231పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 38బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఎనమిది సిక్సర్లతో 90పరుగులు చేసి తన విశ్వరూపం చూపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ (30), మిల్లర్ (47), బేయిల్ (40) రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. 232పరుగుల అతి పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ఆ జట్టు తొలి వికెటు కోల్పోయింది. డూప్లీయస్ ఒక్కడే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ రాణించక పోవడంతో 187పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో జాన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. 90పరుగులు ఒక్క వికెట్ తీసిన మ్యాక్స్ వెల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

No comments:

Post a Comment