ఢిల్లీ:
యూపీఏ-2
ప్రభుత్వం
చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు పిల్లల విద్యా
భత్యం సహా కొన్ని గ్రాంట్లను
పెంచింది. విద్యాభత్వం
వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు
రూ.1,500) చేస్తున్నట్లు
సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ
చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం
ఈ మొత్తం రూ.12,000గా
ఉంది. వైకల్యం
ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు
ప్రత్యేక భత్వం ప్రస్తుతం
నెలకు రూ. వెయ్యి
ఉండగా దాన్ని రూ.1,500చేశారు.
వైకల్యం ఉన్న
పిల్లల విద్యాభత్వం వార్షిక
పరిమితిని రూ.36,000 చేశారు.
సవరించిన
మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి
1 నుంచి
వర్తిస్తాయి.
ఈ అక్షరాలు ఓ పేదవాడికి అన్నం పెట్టాలి...! నిండు జీవితాలకు ప్రాణం పోయాలి..! ఓ విద్యార్థికి ఆయుధాన్ని ఇవ్వాలి..! ప్రేమికులకు ఓదార్పునివ్వాలి..! అప్పుడే కలలకు ఓ దారి దొరుకుతుంది....
Showing posts with label తాజావార్తలు. Show all posts
Showing posts with label తాజావార్తలు. Show all posts
Wednesday, 7 May 2014
Saturday, 12 October 2013
''ఇక ఆడలేను అలసి పోయాను....!
హైదారబాద్
: భారత
క్రికెట్ చరిత్రలో ఒక శకం
ముగీయనుంది. పరుగుల
రారాజు..! క్రికెట్
దేవుడు సచిన్ టెండూల్కర్
టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై
చెప్పనున్నాడు.. ఈ
నిర్ణయమై బిసిసిఐ తో చర్చించి
తన నిర్ణయాన్ని ప్రకటించాడు..అయితే
2012లో
వన్డే క్రికెట్ కు వీడ్కోలు
పలికిన సచిన్...ఎన్నో
రికార్డులు, మరెన్నో
అవార్డులు అందుకున్నాడు...
16ఏళ్ల ప్రాయంలో
తన కెరీర్ ను ప్రారంభించిన
సచిన్ ఎవ్వరికి అందని ఎత్తుకు
ఎదిగాడు .. 198టెస్టు
మ్యాచ్ లు ఆడిన సచిన్ టెండూల్కర్
200 వ
టెస్టు మ్యాచ్ కోసం ఆత్రుతగా
ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.
అయితే క్రికెట్
లేని జీవితాన్ని ఊహించుకోవడం
కష్టమని తెలిపాడు. తన
సుదీర్ఘ కెరీర్ కు సహాకరించిన
అభిమానులకు , బిసిసిఐ
కి, మరియు
కుటుంబ సభ్యులకు అతను కృతజ్ఞతలు
తెలిపాడు.
సచిన్
లేని స్థానాన్ని ఊహించగలమా....!
దిగ్గజ
క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్
, వివిఎస్
లక్ష్మణ్, సచిన్
టెండూల్కర్ రిటైర్మెంట్
తరువాత భారత జట్టును ఊహించలేము.
అయితే ఇప్పుటికే
వివిఎస్, రాహుల్
ద్రావిడ్ భారత క్రికెట్ కు
గుడ్ బై చెప్పగా..!సచిన్
మాత్రం ఇన్నాళ్లు ఆటను
ఆస్వాధిస్తు కొనసాగాడు.
అయితే సచిన్
తరువాత భారత జట్టులో ఆస్థానాన్ని
భర్తీ చేయలగల సమర్థుడు దాదాపు
లేరనే చెప్పాలి.. భవిష్యత్తులో
సచిన్ రికార్డులను తిరగ రాసే
వారు ఉండరని చెప్పాలి...
ఎందుకంటే..
ట్వీ20క్రికెట్
వచ్చిన తరువాత ఆటలోను,
ఆటగాళ్లలోనూ
భారీ తేడా వచ్చింది.
దాదాపు అతి
తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు
చేయాలి అనే భావంతో నేటి క్రిడా
కారులు ఉన్నారు. దీంతో
నేడు టెస్టు క్రికెట్ ఆడే
ఆటగాళ్లు వేళ్ల మీద లెక్క
పెట్టాల్సిన పరిస్థితి మన
భారత క్రికెట్ లో ఉంది.
ఒక్క క్రికెటర్
కూడా గంట పాటు గ్రీజులో ఉంటే
అతి పెద్ద గొప్పే అవుతోంది.
మరీ ఇలాంటి
పరిస్థితిలో ఐదు రోజుల సాంప్రదాయ
క్రికెట్ లో నిలదొక్కుకుని
ఆడే ఆటగాళ్లను బూతద్దం పెట్టి
వెతికినా దొరకనే చెప్పాలి..!అయితే
ద్రావిడ్ , సచిన్
, లక్ష్మణ్
లాంటి వారు టెస్టు క్రికెట్
కు చేసిన సేవ అమోహం. భారత
టెస్టుక్రికెట్ వారు ఐకాన్
ప్లేయర్ గా ఉన్నారంటే అర్థం
చేసుకోవచ్చు వాళ్లు భారత
క్రికెట్ కు చేసిన సేవ...
సచిన్
ప్రస్థానం....!
ప్రపంచ
క్రికెట్ చరిత్రలో ప్రఖ్యాతి
గాంచిన భారత ఆటగాడు ఎవరైనా
ఉన్నారంటే అది ఖచ్చితంగా
భారత 'బ్రాడ్
మెన్' సచిన్
టెండూల్కర్ అనే చెప్పాలి.చిన్న
పిల్లల మొదలు పండు ముసలి దాక
సచిన్ ఓ ఆదర్శంగా ఉన్నాడు.
అయితే 1973లో
జన్మించిన ఇతను 16ఏళ్ల
ప్రాయంలో ప్రపంచ క్రికెట్
కు పరిచయమైయ్యాడు. ఈనాడు
భారత్ అనధికార జాతీయ ఆటగా
కొనసాగుతుందంటే క్రికెట్
దేవుడి పాత్ర మరువరానిది.
అయితే భారత
జట్టుకు ఎన్నో విజయాలు అందజేసిన
ఈ ముంబయి కి చెందిన బ్యాట్
మెన్ ను పొగడని వారు ఉండరు..
అతను మైదానంలోకి
అడుగు పెడుతున్నాడంటే చాలు
రికార్డులు బద్దలు కొట్టాల్సిందే..
బౌలర్లకు
అతని బ్యాట్ ఒక యమ పాషంలా
కనిపించేది. ఫీల్డర్లకు
ఆ బంతి బయంకరంగా దూసుకోచ్చేది.
అలాంటి దిగ్గజం
క్రికెట్ కు దూరమౌతున్నాడంటే
క్రికెట్ అభిమానుల గుండెలు
బద్ధలు కాక తప్పదు మరీ...
ఐ మిస్సుయు
సచిన్....!
Monday, 26 August 2013
యుఎస్ ఓపెన్ కు రంగం సిద్ధం...
న్యూయార్క్: గ్రాండ్ స్లామ్ టోర్ని యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీలు అమెరికాలోని ఆర్థర్ ఆష్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా టెన్నిస్ మహా సమరం ఆస్ట్రేలియా టోర్నితో ప్రారంభమై యుఎస్ టోర్నితో ముగిస్తుంది.. ప్రపంచంలోని నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నిగా అమెరికా టోర్నికి పేరుంది. ఈ టోర్నిని ఆగస్టు సెప్టెంబర్ నెలలో నిర్వహస్తుంటారు. తొలిసారిగా 1881లో ప్రారంభమైన యుఎస్ ఓపెన్ కు ఓ ప్రత్యేకత ఉంది. వింబుల్డన్ , ఆస్ట్రేలియా ఓపెన్, టోర్నమెంట్ లలో ఆఖరిసెట్ తప్పా... మిగతా సెట్ లో మాత్రమే టై బ్రేక్ ఉంటుంది . కానీ యుఎస్ ఓపెన్ లో మాత్రం అన్ని సెట్ లలో టై బ్రేక్ ఉంటుంది. ఇది ఈ టోర్ని ప్రత్యేకత. 1881నుంచి 1967వరకూ ఈ టోర్నీని అమెరికన్ నేషనల్ ఛాంపియన్ టోర్నీగానే నిర్వహించేవారు. అయితే తొలిసారిగా 1968లో తొలిసారిగా ఈ టోర్నీని ఓపెన్ ఫార్మాట్ లోకి మార్చారు. 1987లో యుఎస్ ఓపెన్ సమరాన్ని నాలుగవ ప్రధాన గ్రాండ్ స్లామ్ టోర్నీగా మార్చారు. యుఎస్ ఒపెన్ టోర్నీని 1881నుంచి 1974వరకు గ్రాస్ కోర్టులో నిర్వహించారు. ఆతరువాత 1975నుంచి 1977వరకు క్లే కోర్టులో పోటీలను నిర్వహించారు. ఇక ఆతరువాత నుంచి ఇప్పటి వరకు సింతటిక్ డెకోటర్ఫ్ కోర్టులో నిర్వహిస్తున్నారు. ఈ డెకోటర్ఫ్ మామూలు కోర్టులు కాకుండా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. బౌన్స్ తక్కువగా ఉండే ఈ టోర్నీలో రణించాలంటే టెన్నీస్ ప్లేయర్లకు పెద్ద సవాలే.. మురో వైపు ఈ అమెరికన్ ఓపెన్ లో ప్రైజ్ మనీ కూడా భారీ గా ఉంటుంది. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి 25లక్షల అమెరికన్ డాలర్లు అందజేస్తారు. రన్నరఫ్ గా నిలిచిన వారికి తొమ్మిదిన్నర లక్షలు ప్రైజ్ మనీ గా అంధిస్తారు.
మరో పోరుకు సిద్దం...

Sunday, 21 July 2013
'చిరు'ని కలిసిన అఖిలేష్
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని కలిశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన సిఎం, ప్రతిపక్షనేతతో పాటు రాష్ట్రంలోని పలువురు నేతలతో భేటీ అయ్యారు. నగరంలో జరిగే అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనే ముందు ఆయన చిరును కలిశారు. ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్ను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా, వట్టి వసంత కుమార్ కలిశారు.
Subscribe to:
Posts (Atom)