Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts
Showing posts with label ఆంధ్రప్రదేశ్. Show all posts

Wednesday, 7 May 2014

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం కానుక

ఢిల్లీ: యూపీఏ-2 ప్రభుత్వం చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల విద్యా భత్యం సహా కొన్ని గ్రాంట్లను పెంచింది. విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు రూ.1,500) చేస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.12,000గా ఉంది. వైకల్యం ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు ప్రత్యేక భత్వం ప్రస్తుతం నెలకు రూ. వెయ్యి ఉండగా దాన్ని రూ.1,500చేశారు. వైకల్యం ఉన్న పిల్లల విద్యాభత్వం వార్షిక పరిమితిని రూ.36,000 చేశారు. సవరించిన మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తాయి.


కటక్ లో చెన్నై కటకట...!

కటక్: ఐపిఎల్-7లో భాగంగా పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ సూపర్ విక్టరీ సాధించింది.44పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. విధ్వంసకర మ్యాక్స్ వెల్ మరో సారి తన ప్రతాపాన్ని చూపించడంతో మొదటగా పంజాబ్ నిర్ణీత 20ఓవర్లకు 231పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ 38బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఎనమిది సిక్సర్లతో 90పరుగులు చేసి తన విశ్వరూపం చూపించాడు. వీరేంద్ర సెహ్వాగ్ (30), మిల్లర్ (47), బేయిల్ (40) రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. 232పరుగుల అతి పెద్ద లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే ఆ జట్టు తొలి వికెటు కోల్పోయింది. డూప్లీయస్ ఒక్కడే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ ఎవరూ రాణించక పోవడంతో 187పరుగులే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో జాన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. 90పరుగులు ఒక్క వికెట్ తీసిన మ్యాక్స్ వెల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  

Tuesday, 25 February 2014

/home/media10/Downloads/Unconfirmed 945081.crdownload
/home/media10/Downloads/Osmania-University-BA-BCom-BSc-BSW-I-II-III-Yr-March-2014-Annual-Exam-Time-Table (8).pdf/home/media10/Downloads/Osmania-University-BA-BCom-BSc-BSW-I-II-III-Yr-March-2014-Annual-Exam-Time-Table (8).pdf

Monday, 10 February 2014

ముంచుకొస్తున్న మూడో అడుగు...!

 
దేశంలో రెండు పెద్దపార్టీలతో సామన్యుడు విసిగిపోయాడు. దీంతో తనకు లాభం చేకూర్చే మూడో ప్రత్యామ్నాయ పార్టీల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఎ, బిజెపి నాయకత్వంలోని ఎన్టీయే ల కోటలు బీటలు వారుతుండటంతోమూడో ఫ్రంట్ హడావుడి మళ్లీ మొదలైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,మూడో ప్రత్యామ్నాంయం మాట అనగానే దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలతో మూడో ఫ్రంట్ ముచ్చట్లు ఊపందుకున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీ ను కూలదోసే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అనే ఆలోచనలో థర్డ్ ఫ్రంట్ నిమగ్నమైంది. అయితే 1991 నుంచి కూడా దేశంలో కాంగ్రెస్, బిజెపి సహాయం లేకుండా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వాతావరణం ఉంది. కేంద్రంలో అధికారం కావాలనుకుంటే ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానితో చేయి కలపాల్సిందే. ఇటీవల కొన్ని పార్టీలు ఈ రెండు కూటముల నుంచి దూరం జిరిగాయి దానికితోడు వామపక్షాలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలు అంధించాలనే తపనతో థర్డ్ ఫ్రంట్ కు వామపక్షాలు నాయకత్వం వహిస్తాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఒడిశా, అసోంలలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయి. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ అధికారంలో ఉంది. అసోంలో అసోం గణపరిషత్ ప్రతిపక్షంలో ఉంది. ఈ రెండు పార్టీలు మాత్రం మూడో ఫ్రంట్‌లో చేరేందుకు ముందుకువస్తాయి. ఒడిశాలో కాంగ్రెస్ ప్రతిపక్షం అయితే, బీజేపీ ఉనికి నామమాత్రమే.

మహారాష్ట్రలో కాంగ్రెస్-నేషనలిస్టు కాంగ్రెస్; బీజేపీ-శివసేన కూటాలు బలంగా ఉన్నాయి. అంటే మూడో ఫ్రంట్ వైపు చూసే శక్తులేవీలేవు. రాజ్ థాకరే తన ఎంఎన్‌ఎస్ పార్టీని మూడోశక్తిగా రూపొందిస్తాడన్న ఆశ లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవరెడి బ్యాటరీ లాగా అన్ని ఫ్రంట్‌లకు పనికొస్తాడు. రాష్ట్రంలో చంద్రబాబు మునుపటంత శక్తిమంతుడు కాకపోవడంతో, ఆయన మూడో ఫ్రంట్ ముచ్చట్లకు అంతగా ఊపు రావడం లేదు. అయితే, బాబు మూడో ఫ్రంట్ ఏర్పాటుకు బాగా శ్రమదానం చేయగలడు. కాంగ్రెస్, టీడీపీ కాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)- ఈ రెండు ప్రాంతీయ పార్టీల హవాయే ఇప్పుడు గట్టిగా వీస్తోంది. కానీ, ఈ రెండు పార్టీలు బాబు ఉండే ఫ్రంట్‌లో చేరే అవకాశం లేదు. అందువల్ల బాబుతో పాటు ఇక్కడ ఏ పార్టీ మూడో ఫ్రంట్ వైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే.

గణాంకాల సంగతి

కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్రాలలో దాదాపు 320 మంది ఎంపీలుంటారు. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రాబల్యం తక్కువ కాబట్టి ఈ రెండు పార్టీ లకు 80 సీట్లకు మించిరావడం కష్టం. ఇక మిగిలిన 220 సీట్లు మూడో ప్రత్యా మ్నాయానికే వస్తాయి. ఒడిశా, బెంగాల్, ఆంధ్రఫ్రదేశ్, తమిళనాడులలో బీజే పీకి ఎంపీ సీట్లు దక్కే అవకాశంలేదు. ఇలాగే, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌కు వచ్చేవి నామమాత్రమే.

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలలో దాదాపు 200 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే, 320 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్, బీజేపీల ప్రాబల్యం బాగా తక్కువ. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతూ ఉంటాయి.

ప్రత్యామ్నాయానికి సాధ్యాసాధ్యాలు

ప్రస్తుతానికి ఎటు తేల్చుకోని ములాయంసింగ్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, చంద్రబాబు ఈ మధ్య మూడో మంత్రం ఉచ్చరిస్తున్నారు. వీళ్లెవరూ బీజేపీతో, కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు. బీజేపీకి ఎన్నికల ఎదురుదెబ్బలు తగలడంతో ఈ మధ్య వీరికి కాషాయం కషాయంగా అనిపిస్తుంది. ఇదే విధంగా నవీన్ పట్నాయక్, జయలలిత కూడా ఏ కూటమి వైపు మొగ్గకుండా కొనసాగాలను కుంటున్నారు. తమ తమ రాష్ట్రాలలో ఈ నాయకులకు మరొక పార్టీతో పొత్తు అవసరంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క వైఎస్సార్‌సీపీకి మాత్రమే అలాంటి తాహతు ఉంది.

దాదాపు 300 స్థానాలలో బలంగా ఉన్న మూడో ఫ్రంట్ పార్టీలకు కనీసం 200 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్, బీజేపీల బలం కంటే ఎక్కువే కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నుంచి మూడో ఫ్రంట్‌కే మొదటి అవకాశం వస్తుంది. ఎన్నిలకు ముందు ఒక కూటమిగా తయారైతే, ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం తమకేవస్తుందని ఈ నాయకులంతా భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో ఈ అర్హత సంపాదించడం అన్ని పార్టీల లక్ష్యంగా ఉంటుంది. ఇటీవలి సంప్రదాయం ప్రకారం, ఏ పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే, రాష్ట్రపతి నుంచి పిలుపు ఆ పార్టీకి లేదా కూటమికి వస్తుంది.

కాంగ్రెస్ నితీష్‌ను రోజూ ఆకాశానికెత్తడం, జార్ఖండ్ ముక్తిమోర్చాతో మళ్లీ మాట కలపడం కూడా ఇందుకే. ఒక ముఖ్యమైన భాగస్వామి నితీష్‌ను దూరం చేసుకుని బీజేపీ బలహీనపడింది. బీజేపీ కూటమిలో ఇప్పుడు శివసేన, అకాలీ దళ్ తప్ప మరొక పార్టీలేదు. హర్యానాకు చెందిన ఓమ్‌ప్రకాశ్ చౌతాలా, అసోం గణపరిషత్, జార్ఖండ్ ముక్తిమోర్చా, డీఎంకే ఇలా దూరమైనవే. కొత్త పార్టీలేవీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగాలేవు. ఈ లోటు భర్తీ చేసుకునేందుకు బీజేపీ ఇప్పుడు నరేంద్రమోడీని ఊరూరా ఊరేగించేందుకు సిద్ధమవుతూ ఉంది. వచ్చే ఎన్నికలలో పూర్తి ఆధిక్యత రాకపోయినా, అందరికంటే పెద్ద పార్టీ అర్హత వస్తే చాలు, రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుతుంది. అందువల్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి పోటీ ఉన్న 200 స్థానాలలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు బీజేపీ మోడీ ప్రయోగానికి పూనుకుంటోంది. ఈ స్థానాలలో వెనకబడితే, పార్లమెంటులో అతిపెద్ద పార్టీ హోదా దక్కే అవకాశాన్ని కాంగ్రెస్ కోల్పోతుంది. బీహార్, బెంగాల్, అసోం, ఒడిశాలలో మోడీ చెల్లని కాసే అయినా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మోడీ మ్యాజిక్ పనిచేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా యుద్ధాలన్నింటినీ పుర్తిగా గెలవాల్సిన పనిలేదు. శత్రువు ముందుకు కదలకుండా ఆపగలిగితే చాలు యుద్ధం గెలిచినట్లే. కొన్ని కీలకమైన రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగిలితే ఆ పార్టీకి అతిపెద్ద పార్టీ హోదా గల్లంతవుతుంది. అందువల్ల 2014లో ప్రధాన పోటీ ఉండేది కేవలం 200 స్థానాలలోనే.

200 స్థానాలూ కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించేవే. ఈ స్థానాలలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తే మూడో ఫ్రంట్ ముందుకొస్తుంది. మూడో ఫ్రంట్, బీజేపీల మధ్యనే పోటీ ఉంటుంది. రాష్ట్రపతి మూడో ఫ్రంట్‌ను ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆహ్వానిస్తే బీజేపీకి అభ్యంతరంలేదు. ఎందుకంటే, ఈ ఫ్రం ట్‌తో లావాదేవీలు కష్టంకాదు. వీలుంటే, కనీస ఉమ్మడి ప్రణాళికతో మూడో ఫ్రంట్‌లో తానూ భాగస్వామి కావచ్చు. లేదా బయట నుంచి మద్దతేనిచ్చి కాం గ్రెస్‌ను తరిమేయవచ్చు. బీజేపీ వ్యూహం మూడో ఫ్రంట్‌కే ప్రయోజనం. ఇక తన సెక్యులర్ ‘అజెండా’ను ముందుకు తీసుకుపోయేందుకు, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కూడా మూడో ఫ్రంట్‌కే మద్దతివ్వాల్సివస్తుంది. కాబట్టి కాంగ్రెస్‌కు కమలం ఒక బూచిలా కనపడేట్లు చేయడం మూడో ఫ్రంట్ నేతల విధి. మోడీ రాకతో కూడా ఈ పని సులవ వుతుంది. మోడీ భయం వల్ల కాంగ్రెస్ అనివార్యంగా మూడో ఫ్రంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయదు.

Saturday, 8 February 2014

మరో స్వాతంత్య్రం కోసం పోరాడాల్సిన సమయమిది.!

హైదరాబాద్: నేడు రాజకీయాలు బురదలో చిక్కుకున్న పందిలా దయారయ్యాయి. ఏ దేశ చరిత్ర చూసిన ఏముంది గర్వకారణం...!పరదేశ పరాయణత్యం అన్న శ్రీశ్రీ చందంగా ఉంది నేడు దేశ రాజకీయాలు. వార్డు నెంబర్ నుంచి ప్రధాన మంత్రి పదవి వరకు దోచుకోవడమే పనిగా పెట్టుకుని తన రాజకీయ మనుగడను సాగిస్తున్నారు. ఈలాంటి రాక్షస రాజ్యంలో పేదల ఆకలి తీరేదెప్పుడు...! మనకు స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆకలి ! ఆకలి అంటూ పేదవాడి అరుపులు ఆగలేదు. మరెప్పుడు ఈ 65ఏళ్ల స్వతంత్య్ర భారతం ప్రగతి పథంలో దూసుకుపోయేది. మరెప్పుడు యువత కళ్లల్లో ఉద్యోగ క్రాంతి కనబడేది.
ప్రజా సామ్యం పై నమ్మకం పోయింది....!
రాజకీయ పార్టీలపై నేటి యువత పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉండాలని నేటి యువత ఆలోచన! అయితే స్వాతంత్య్ర కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాటీ యువత అల్లూరి సీతా రామరాజు, భగత్ సింగ్ లాంటి వారు అప్పట్లో యువతను మెల్కోల్పారు. కానీ నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలంటే అంటరానివిగా చూస్తున్న వారి ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే గొద్దిగా మార్పు వస్తుంది. ఈ రాజకీయాలను మార్చే శక్తి తమకే ఉందని గ్రహించిన యువత మరో స్వాతంత్ర్యానికి పూనుకోవాల్పిన అవసరం ఎంతైనా ఉందని వారు భావిస్తున్నారు.
యువతను టార్గెట్ చేసిన పార్టీలు
తమ పార్టీల దశా దిశను మార్చేది యువతనే అని గ్రహించిన పార్టీలు ఇప్పుడు ప్రధాన దృష్టి యువతపైనే పెట్టింది. సాధ్యమైనంత వరకు యువతను ఆకట్టుకునే విధంగా ప్రకటనలు చేస్తుంది. నిన్నటికి మొన్న దేశ రాజకీయాలకు బయం పుట్టించిన ఢిల్లీ ఎన్నికలు ఇప్పుడు పార్టీలకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. 2014లో ఏ విధంగానైనా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్న బిజెపి, నరేంద్ర మోడి ఇమేజ్ ను కూడకట్టే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆచితూచి స్పంధిస్తుంది. ఈ రెండు ప్రధాన పార్టీల సంగతి ఈ విధంగా ఉంటే ప్రాతీయ పార్టీలు ఈ సారి మాత్రం సత్తా చాటాలని ఉవ్విర్లూరుతున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్, బిజెపి లకు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీలైనా థార్డ్ ఆప్షన్ గా ఉంటే యువత మాత్రం అక్కడ మొగ్గుచూపుతుందని చెప్పవచ్చు.
ప్రధానం కానున్న సోషల్ మీడియా...!
నేటి యువత 47శాతం సోషల్ మీడియాని భాగా వాడుతున్నారు. ఇది గమనించిన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాని ప్రచార మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. నిన్నటికి నిన్న దేశ రాజధానిలో కొత్త చరిత్ర లిఖించింది యువతే అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇది ఈ నాటి రాజకీయాల్లో కొత్త అధ్యయనం. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన వారంతా యువతే కావడం మనం గమనించాలి. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ప్రచారం చూస్తే, వారి విజయం యువతలో మరింత ఆశలు పెరుగుతున్నాయి. ఇలాంటి యువత వట్టి పోకూడదు. ఓటేనే బ్రహ్మాస్త్రంతో నవ చరిత్ర సృష్టించాలి.
కాలయాపన మానండీ ....!కాలాన్నితిరగరాయండీ..!
నేటి యువతకు లైఫ్ అంటే సెలబ్రేషన్. క్లబ్ లు, పబ్ లు సినిమాలు, షికార్లు, టీవి ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం . మారుమూల పల్లెలకి ఈ వాతావరణం వచ్చేసింది. తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్పోన్ ఉండటం సాధారనమైపోయింది. కానీ ప్రజల్లోకి , ప్రజా సమస్యల్లోకి చొచ్చుకుపోయింది మాత్రం లేదు..

కుళ్లు పట్టిన రాజకీయాలను కడగేయాల్సింది మనమే...!కళ్లు తెరిచి దేశ భవిష్యత్తును లిఖించాల్సింది మనమే..!

Thursday, 12 December 2013

దేశ భవిష్యత్తే యువత....!


ఛీ... ఈదేశాన్ని మార్చలేము...! ఈ రాజకీయ నాయకులను మార్చలేము..! మనకెందుకురా బాబు ఈ రాజకీయాలు....!మన పనేందో మనం చూసుకుందాం..! ఇది తరుచుగా వినిపించే మాటలు... రాజకీయాలపై , దేశ అవినీతి పై విసుగు చెందిన వారు తరుచు మాట్లాడే మాటలు...! కానీ ఇక ముందు ఆ మాటలు రావేమో... దేశ భవిష్యత్తును శాషించే ఆయుధాలు రానున్నాయి... అవే యువ ఓటర్స్.... అవునూ ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 15వేల కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి కొత్త గా ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు...!నిద్రలేచిన మొదలు ట్విటర్లు, ఫేస్ బుక్ లతో బిజీగా గడిపే ఈ యువతరం తమ అమూల్యమైన ఓటుతో దేశభవిష్యత్తును తిరగ రాయనున్నారనడంలో సందేహం లేదు.!అయితే చుట్టు రాజకీయ వాతావరణం గమనిచంలేని ఈ యువతరం ఎక్కువగా ఎక్కడ ఆకర్షితులవుతారన్నది ముఖ్యం...!
చరిత్ర తిరగ రాయగలరా...!

యువతరం తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు...!ఇది అనేక దేశ చరిత్రలో కూడా కనిసిస్తుంది. నెత్తురు మండే శక్తులు నిండిన ఈ కుర్రాళ్లు...అవినీతికి ప్రత్యామ్నాయంగా నిలుస్తారు..! అయితే మన దేశంలో ప్రతీ ముగ్గురులో ఒక యువకుడున్నాడు. అంటే రాబోయో రోజుల్లో దేశం యువ దేశంగా మారనుంది . దీంతో సగటు భారతీయుని వయస్సు 29ఏళ్లు కానున్నాయి. దీంతో 2014లో దేశ భవిష్యత్తును రాజకీయ నాయకుల తలరాతలను మార్చేది మాత్రం యువతే అని చెప్పవచ్చు.... దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి... ఢిల్లీలో మాత్రం ఈ ప్రభావం మరీ ఎక్కువగా పడింది. నిర్భయ ఉదంతం... పెరిగిన ధరలు యువ ఓటర్లను భాగా ప్రభావం చూపాయి...

Sunday, 10 November 2013

క్రికెట్ పిచ్చోడు...



ముంబై: ఇండియా మ్యాచ్ లంటే అభిమానులు మొత్తం స్టేడియంలో కిక్కిరిసి పోతారు....! బంతి వికెట్ ను గిరాటేసినా..... బ్యాట్ బంతిని బాదినా స్టేడియం మొత్తం అభిమానుల హంగామా....అరుపులు చూస్తాం....! ఈ హంగామా, అరుపుల మధ్య ఓ క్రికెట్ పిచ్చోడు! ఒంటి నిండా జాతీయ జెండా రంగు...!చేతిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా! ప్రతీ షాట్ కి అతని చేతిలో జెండా రెపరెపలాడుతోంది... వికెట్ పడ్డప్పుడు...అదే జెండా నింగిలో సాలామ్ చేస్తుంది.... భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా ఆ పిచ్చోడు ఆ స్టేడియంలో ఉంటాడు.... అతనే సుదీర్ చౌదరి....సచిన్ వీరాభిమానైన ఇతను భారత క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతాడు. ప్రతీ మ్యాచ్ ను ఆస్వాదిస్తాడు... ఆనందిస్తాడు.. మ్యాచ్ ఓడినప్పుడు కుంగిపోతాడు.
ఖర్చుమొత్తం అతనే....!
అయితే భారత మ్యాచ్ లంటే టికెట్లు దొరకవు, పైగా స్వదేశంలో అంటే అస్సలు దొరకవు . మరీ ఇతనికి ఏ విధంగా టికెట్ దొరుకుతాయని అందరికి సర్వసాధారణంగా డౌట్ వస్తుంది... అవును ఇతను ఎక్కడికి పోయినా ఆ ఖర్చును మొత్తం సచిన్ టెండూల్కర్ భరిస్తాడు. ఆ మ్యాచ్ లో సచిన్ ఉన్నా లేకున్నా సుదీర్ చౌదరి మాత్రం స్టేడియంలో ఉంటాడు.. ఇతనికి ప్రయాణ ఖర్చులు, స్టేడియం టికెట్ ఖర్చులు, మొత్తం సచిన్ చూసుకుంటాడు. దీంతో భారత మ్యాచ్ లు ఎక్కడ జరిగినా వింత వింత విన్యాసాలతో తనకున్న క్రికెట్ అభిమానాన్ని చాటుకుంటూ అప్పుడప్పుడు కెమరాకు క్లిక్ మనిపిస్తాడు.
నిద్రలేని రాత్రులు....

ప్రపంచ కప్ భారత్ గెలవాలని కలలు కన్నాడు సుదీర్ చౌదరి. కపిల్ సారథ్యంలో వచ్చిన కప్ మళ్లీ ఈ సారి భారత్ వశం కావాలని కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా కప్ గెలవాలని తన నెత్తిపై కప్ ఆకారంలో కటింగ్ చేయించుకున్నాడు... క్రికెట్ పై , దేశం పైఉన్న అభిమానమే తనను ఈ విధంగా చేయిస్తుందని చౌదరి చెప్తున్నాడు

క్రికెట్ రూపం మార్చుకుంటుందా....!


హైదరాబాద్: అంతర్జాతీయంగా క్రికెట్ రూపం మార్చుకుంటుంది... కొత్త కొత్త నిబంధనలతో క్రికెట్ సరికొత్తగా తయారవుతోంది. ఒకప్పుడు 5రోజుల క్రికెట్ అంటే కచ్చితంగా ఐదవ రోజు దాని ఫలితం తేలేది...కానీ ఇప్పుడు దాని రూపం మారింది. టెస్టు క్రికెట్ సైతం వన్టేలాగా తయారవుతోంది. ఇప్పుడున్న టెస్టు క్రికెట్ లు మూడు రోజుల్లో ఫలితాలు తేలిపోతున్నాయి. దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ఫాస్టు క్రికెట్ లాగా తయారైంది. దీనిపై చాలా మంది సీనియర్లు టెస్టు క్రికెట్ ను అంతరించిపోకుడా కాపాడాలని, అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఎన్ని సలహాలు చేసినా టెస్టు ఉనికిని మాత్రం కాపాడలేకపోతున్నారు.
ఫాస్ట్ పుడ్ లా పొట్టి ఫార్మెట్...
టీ20ల వల్ల టెస్టు క్రికెట్ భవితవ్వం అంతరించిపోతుందనడంలో సందేహం లేదు... ధనాధన్ ఈ మార్ ధన్ లో దంచుడే పనిగా పెట్టుకుని నైతికతో కూడి ఆటను మర్చిపోతున్నారు. టీ20 ఫార్మెట్ అంటే 20 ఓవర్లలో ఎంత ఎక్కువ పరుగులు రాబట్టుకుంటే అంత విజయ అవకాశాలు ఉంటాయని వారి అభిప్రాయం. దీని తోనే ప్రతీ బాల్ ను బౌండరీ తరలించాలని కొట్టుడే పనిగా పెట్టుకున్నారు. దీంతో వన్డేలు, టెస్టు క్రికెట్ కు వచ్చేసరికి కనీసం గంట సేపు గీజులో నిలదొక్కుకోలేని పరిస్థితి నేటి ఆటగాళ్లలో ఉంది. ఈ క్రమంలో టెస్టులకు చాలా మంది ఆటగాళ్లు గుడ్ బై చెప్పి వన్టేలు.. టీ20 మాత్రమే ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. ఈ మూడు గంటల టీ20లపై ఆదరణ అభిమానుల్లో రోజు రోజుకు ఎంత పెరుగుతుందో టెస్టు క్రికెట్ కు అంతే స్థాయిలో ఆదరణ తగ్గుతోందనడం విస్మరించలేము..
అదే కోరుకుంటున్న అభిమానులు....

నేటితరం క్రికెట్ అభిమానులు టీ20లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. నిమిషం సమయాన్ని కూడా వృధా చేయని ఈ రాకెట్ యుగంలో క్రికెట్ అభిమానులు ఎక్కువగా టీ20లపై ఎక్కువ మోజు పడుతున్నారు. టెస్టు క్రికెట్ లను , వన్డేలను మరిచి మరుగున పడేస్తున్నారన్నది పక్కా వాస్తవం...ఉదాహరణ కుతీసుకుంటే ఒకప్పుడు వన్డేలల్లో 300 పరుగులు చేస్తే... పక్కా విజయం అని నమ్మిన వారు. ఇప్పుడు 400మార్కు స్కోరును చేసినా విజయం వరిస్తుందో లేదో నని నమ్మకం లేదు. అంటే టీ20 ప్రభావం ఎంత ప్రభావం పడిందో మనం ఇక్కడ చూడోచ్చు... మరో వైపు ఓ ఫార్మెట్ నిరూపించుకున్న ఆటగాళ్లు ఇంకో ఫార్మెట్ లో నిరూపించుకోవడం లేదు. ఉదాహరణకు టీ20 స్పెషలిస్ట్ గా పేరు సంపాధించుకున్న యుసుఫ్ పఠాన్ లాంటి క్రికెటర్లు దనాధన్ క్రికెట్ లో కొద్దిగా మేరిసినా... తరువాత అన్ని ఫార్మెట్ లల్లో విఫలమయ్యారు. క్రికెటర్ అన్న వాడు అన్ని ఫార్మట్ లో రాణించాలి... ప్రతిభను ఉపయోగించుకోవాలి... క్రికెట్ ను ఆస్వాధించండీ.... టెస్టులను కాపాడండీ....!

Saturday, 2 November 2013

'వీ'రోహితం


                           డబుల్ సెచరీతో చెలరేగిన  రోహిత్ శర్మ....!

బెంగళూర్: భారత నయా ఓపెనర్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు.. ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడో వన్డేలో డబుల్ సెంచరీ తో చెలరేగి పోయాడు. 158బంతులో 209 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్ గా రోహిత్ రికార్డు సృష్టంచాడు.దీంతో సచిన్, సెహ్వాగ్ సరసన రోహిత్ నిలిచాడు. అయితే ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ తన నిర్ణయానికి భారీ మూల్యం చెల్లించుకుంది.భారత ఓపెనర్స్ ఆస్ట్రేలియా బౌలర్స్ లకు చుక్కులు చూపిస్తూ భారీ భాగసామ్యాన్ని నెలకోల్పారు. దీంతో తొలి 19ఓవర్స్ లో ఓపెనర్స్ 112 పరుగులు సాధించారు. 60పరుగుల చేసిన ధావన్, డోహర్తి బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆతరువాత వచ్చిన విరాట్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన రైనా కాసేపు ఆ కట్టుకున్న పెద్దగా పరుగులు చేయలేక ఔటయ్యాడు. యూవరాజ్ సైతం మరో సారి విఫలమయ్యాడు. దీంతో ధోనీతో కలిసి రోహిత్ చక్కని ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. ఎడా పెడా సిక్స్ లు ఫోర్లు కొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఏకంగా ఇన్నింగ్స్ లో 16 సిక్స్ లు భాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ రికార్డుల కెక్కాడు.
సిసలైన ఇన్నింగ్...

'' ప్రతిభ ఉంది కానీ నిర్లక్ష్యం …! ఆడగలడు కానీ నిలదొక్కుకోలేడు..!ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోడు...! ఇది నిన్నమెన్నటి వరకు రోహిత్ పై తరుచు వినిపించే విమర్శలు . తన ప్రతిభను చూసిన క్రికెటర్లు ఇతన్ని ప్రోత్సహించారు. ఐపిఎల్ లో అద్భుతాలు చేసి భారత జట్టులోకి వచ్చిన రోహిత్ నిజంగా విమర్శలు తగ్గట్టే ఉండేవాడు. నిలకడలేమి ! ఎన్ని అవకాశాలు ఇచ్చిన నిరూపించుకోక పోవడం ఇలా రోహిత్ ప్రస్థానం సాగింది. కానీ భారత జట్టుకు సీనియర్స్ ఓపెనర్స్ దూరం కావడంతో వారి స్థానాలను భర్తి చేయడానికి రోహిత్ ఓపెనర్ అవతారమెత్తాడు. ఈ అవకాశాన్ని రెండు చేతుల ఓడిసి పట్టుకున్న రోహిత్ దానికి తగ్గట్టుగానే రానిస్తూ మన్ననలు అందుకున్నాడు. దీనికి తోడు ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్ కు ఓపెనర్ గా శివతాండవం చేస్తున్నాడు.    

Friday, 1 November 2013

వెస్టిండీస్ సిరీస్ కు కుర్రాళ్లు...


ముంబై: వెస్టిండీస్ తో జరగనున్నటెస్టు సిరిస్ కు భారత జట్టును బుధవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం కుర్రాలకు చోటు కల్పిస్తూ బిసిసిఐ టీం ను ప్రకటించింది. అయితే సచిన్, ధోనీ తప్పా ఈ సిరిస్ ఎవరూ టెస్టు అనుభవం లేక పోవడం విశేషం. అయితే వన్డేలోనూ దుమ్ము దులుపుతున్న కుర్రాళ్లు టెస్టుల్లోను ఏ విధంగా రాణిస్తారో చూడాలి...!
సెహ్వాగ్, గంభీర్ లకు దక్కని చోటు..
అయితే టెస్టు సిరిస్ కు భారత జట్టులోకి సీనియర్స్ ని తీసుకుంటారని అందరు భావించారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తు బిసిసిఐ టీం ను ప్రకటించింది. దీంతో భారత జట్టులోకి మళ్లీపునరాగమనం చేయాలనుకున్న సెహ్వాగ్ , గంభీర్ లకు నిరాషే మిగిలింది.
మరో సారి నమ్మకం...
ఇటీవల పేలవ ఫాం లేమితో భాద పడుతున్న ఇషాంత్ షర్మకు సెలక్టర్స్ మరో అవకాశాన్ని ఇచ్చారు. ఒక్క సారి విఫయమైనంత మాత్రాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లను పక్కకు పెట్టాల్సిన పని లేదని బిసిసిఐ తెలిపింది. మరో ఆటగాడు రోహిత్ షర్మ ఇతను వన్డేలో ఓపెనర్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఇతను పై నమ్మక ముంచిన సెలక్షన్ కమిటి టెస్టులోను తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నారు.
సచిన్ కు చివరి టెస్టు సిరీస్ ...
ఇక సచిన్ సెలక్షన్ చేయడం సెలక్షన్ కమిటికి ఉండక పోవచ్చు సచిన్ ఈ సిరిస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తాడన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని దృష్టింలో పెట్టుకుని సెలక్షన్ కమీటీ మొత్తం యువకుల తో కూడిన జట్టును ప్రకటించింది . దీంతో మంచి ఫాం కొనసాగిస్తున్న కుర్రాలతో , ఇదే ఊపును టెస్టు సిరిస్ లో కొనసాగించి సచిన్ కు సగౌర్వంగా వీడ్కోలు పల్కాలని జట్టు యోచిస్తుంది .

జట్టు వివరాలు. ధోనీ( కెప్టెన్) ధావన్, రోహిత్ , పుజారా, సచిన్, కోహ్లీ, రహానే, విజయ్, భువనేశ్వర్, ఇషాంత్ , అశ్విన్, ఓజా, మిశ్రా, షమీ, ఉమేష్ యాదవ్.,

Thursday, 31 October 2013

మరింత దూసుకుపోవడానికే అఖిలపక్షం...పాల్వాయి..

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మరింత ముందుకు వెళ్లేందుకే కేంద్ర హోం శాఖ అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహిస్తుందని ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ లను వినాలని పార్టీలు కోరుతున్న నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో తాము ఏం చేస్తున్నారో అనే అంశాన్ని మాత్రమే పార్టీలకు వివరిస్తారు. తప్ప విభజనపై మరో మారు అభిప్రాయం కోరబోరని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ వేగాన్ని బట్టి డిసెంబర్ చివరికి రెండు రాష్ట్రాల ఏర్పాటు కాయమని ప్రకటించారు. పాల్వాయి గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రులు కమిటీ సభ్యుడు జైరాం రమేష్ లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్టప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని సూచిస్తూ వారికి ఓ నోట్ ను అందజేశారు.
సీఎం పిచ్చోడు... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై పాల్వాయి మరో మారు ద్వజమెత్తాడు.. ''వాడు ఓ పిచ్చోడు'' విభజనపై హద్దు మీరి సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నాడు. దీనికి త్వరలోనే తగిన మూల్యం కచ్చితంగా చెల్లిస్తాడని తెలిపారు. పోలవరం పై తెలంగాణ ప్రజలకు అభ్యంతరం లేదు. అయితే 1.35 లక్షల కుటుంబాలు 335గ్రామాలకు ఈ ప్రాజెక్టుతో ముప్పు పొంచి ఉంది 75 టిఎంసిల నీటి కోసం ఇంత ముప్పును కాదని ముందుకు వెల్ల రాదు. సాగునీటి రంగ నిపుణుడు హనుమంతరావు సూచించిన విధంగా మూడు బ్యారేజీలను నిర్మిస్తే నష్టం తక్కువగా ఉంటుంది. 130 గ్రామాలు మాత్రమే ముంపునకు గురౌతాయి. అని పాల్వాయి అన్నారు. నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు 5 గ్రామాలే ముంపునకు గురయ్యాయని చెప్పారు.


ఉల్లిగడ్డ కోసం రైతును చంపిన గుర్తు తెలియని దుండగులు..


రంగారెడ్డి: ఇన్నాళ్లు ఆస్తుల కోసం, డబ్బు కోసం , బంగారం కోసం దొంగతనం చేసేవారు... కానీ నేడు దొంగలు ఉల్లిగడ్డ కోసం హత్యకు కూడా వెనకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఉల్లిగడ్డ రైతును నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే.......  కడ్చర్ల గ్రామంలో నివాస ముంటున్న ఎల్లయ్య అనే రైతు (60) తన పంట పొలంలో పత్తి ,క్యారెట్ తో పాటు ఉల్లిగడ్డను కూడా సాగు చేశాడు. అయితే రోజు మాదిరిగానే రాత్రి 9గంటల సమయంలో ఇంటి వద్దనుంచి కాపలాకు బయలు దేరిన ఎల్లయ్య తన పొలంలోని ఓ చెట్టుకింద నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తన పొలంలోని నిల్వ ఉంచిన ఉల్లిగడ్డ సంచులను దొంగలిస్తుండగా ఎల్లయ్య వారిని అడ్డుకున్నాడు. దీంతో దుండగులు ఎల్లయ్య తలపై కర్రతో బలంగా బాదారు. తీవ్ర రక్త స్రావంతో ఎల్లయ్య అక్కడి కక్కడే మరణించారు. ఇది గమనించిన దుండగులు ఉల్లిగడ్డను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. తెల్లవారుజామున పక్క పొలం వాసి ఎల్లయ్య శవాన్ని చూసి ఊళ్లో సమాచారం ఇచ్చాడు.
భూ తగాదాలే కారణమై ఉండొచ్చు... ఎస్పీ..
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజకుమార్ స్పందిస్తూ భూ తగాదాలే ఎల్లయ్య హత్యకు కారణంగా తాము భావిస్తున్నామని ఈ మేరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు  తెలిపారు. కుంటుంబ సభ్యులు మాత్రం ఉల్లిగడ్డల దొంగతనానికి వచ్చిన వారే ఈ హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.  ఈరెండు కోణాలల్లోనూ విచారణ జరిపి పూర్తి విరాలు వెల్లడిస్తామని గురువారం ఆయన తెలిపారు.

ప్రభుత్వాలు సిగ్గు పడాలి.....

దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంటే ప్రభుత్వాలు మాత్రం మెద్దు నిద్ర వీడటం లేదు. ఉల్లి ధర విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు నాడు ఏం తినలేని పరిస్థితికి వచ్చింది. దీంతో హత్యలకు కూడా వెనకాడకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు...  

Thursday, 10 October 2013

''షేర్ ఖాన్'' ఇక లేరు....!

హైదరాబాద్: తెలుగు సినీ కళామ తల్లి మరో నటుడ్ని కోల్పోయింది. కాలేయ వ్యాధితో రియల్ స్టార్ శ్రీహరి బుధవారం సాయంత్రం హఠాన్మరణం చెందారు. ముంబైలోని ఓ షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీహరి హఠాత్తుగా కిందపడిపోయారు. దీంతో హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.. అయితే తెలుగులో 100పైగా సినిమాల్లో నటించిన శ్రీహరి మంచి ఆర్టిస్ట్ గాను మంచి నటుడుగాను పేరుతెచ్చుకున్నాడు. అతని మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసింది.. ఇలాంటి నటుడ్ని మళ్లీ పొందడం చాలా కష్టమని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు.
రియల్ స్టార్ .....!
శ్రీహరి చిన్నపట్టినుంచి సినిమాల్లో నటించాలని అతని తపన.. కానీ పేదరికం అతన్ని వెంటాడింది.... !సినిమా చూస్తూ తను హీరో స్థాయికి ఎప్పుడు ఎదుగుతానో! అని కలలు కనేవాడు. ఎంతమంది స్నేహితులు హేలన చేసిన తన కలను మాత్రం వీడలేదు. ఎదో నమ్మకం! ఎక్కడో ఆశ! తనను సినీ పరిశ్రమ హక్కున చేర్చుకుంటుందని నమ్మకం, అతన్ని ముందుకు నడిపించింది. దీంతో అతనికి పోలీస్ జాబ్ వచ్చినా కూడా దాన్ని వదులుకుని సినిమాలో నటించడానికి ట్రైన్ ఎక్కేశాడు. మొదటగా చిన్న చిన్న క్యారెక్టర్స్ తో సినీమాలో కనిపించినా... హీరో కావాలనే తపన మాత్రం సడలలేదు.! రోజు ఆల్భమ్ పట్టుకుని తిరుగ సాగాడు సినిమా వాళ్లు కనిపిస్తే చాలు … వాళ్ల చేతిలో కొన్ని ఫోటోలు పెట్టాల్సిందే. అప్పుడే వంగవీటి మోహనరంగ ''చైతన్యరథం'' సినిమా తీస్తున్నారని తెలిసింది. వాళ్లకు ఓ హీరో కావాలి. కొత్తవాళ్లను చూస్తున్నారట ఆ విషయం శ్రీహరికి చేరింది. ఆ హీరో నేనే అని కలలు కంటూ అక్కడ వాలిపోయాడు. శ్రీహరి కండలు గుండెల్లో ధైర్యం వాళ్లకూ ఇంకెముంది! తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించాడు గురువుగారి సినిమా బయటకు వచ్చేస్తే ఇక అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకొన్నాడు. కానీ అవకాశాలు రాలేదు.
తొలిసారి హీరోగా....
హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు.. అదీ తనకు ఇష్టమైన పోలీస్ అవతారంలో శ్రీహరి ఏమిటీ ! హీరో ఏమిటీ! అని నొసలు చిట్లించారంతా ఇక విలన్ వేషాలూ గోవిందా.. అన్నవాళ్ళు ఉన్నారు. కానీ పోలీస్ విడుదలయ్యాక ఆ మాట మళ్లీ వినబడలేదు. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అని పలువురి ప్రశంసలు అందుకున్నాడు... మన రియల్ స్టార్. అతను కన్న కలలు సాకారమైనాయి.. ఇక మిగిలింది సమాజ సేవ.. అని తన కూతురు పేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటేచేశాడు. కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని వాటికి నీటి సరఫరా చేస్తున్నాడు. ఈ విధంగా సమాజ సేవలోనూ తన ముద్ర వేసుకున్నాడు. తను రాబోయే రోజుల్లో రాజకీయాలోకి వస్తాని చేప్పిన అనది కాలంలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు.....!


''కమ్ముకుంటున్న కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా... నువ్వు ఉదయించే సూర్యుడివని వాటికి తెలియదు.... ఈరోజుఅస్తమించవచ్చు గాక, ఈ చీకటి బ్రతుకుని చీల్చుకుంటూ మళ్లీపుడతావురా... మళ్లీపుడతావ్...'''