Thursday, 31 October 2013

మరింత దూసుకుపోవడానికే అఖిలపక్షం...పాల్వాయి..

హైదరాబాద్: రాష్ట్ర విభజనపై మరింత ముందుకు వెళ్లేందుకే కేంద్ర హోం శాఖ అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహిస్తుందని ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ లను వినాలని పార్టీలు కోరుతున్న నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో తాము ఏం చేస్తున్నారో అనే అంశాన్ని మాత్రమే పార్టీలకు వివరిస్తారు. తప్ప విభజనపై మరో మారు అభిప్రాయం కోరబోరని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ వేగాన్ని బట్టి డిసెంబర్ చివరికి రెండు రాష్ట్రాల ఏర్పాటు కాయమని ప్రకటించారు. పాల్వాయి గురువారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మంత్రులు కమిటీ సభ్యుడు జైరాం రమేష్ లతో విడివిడిగా భేటీ అయ్యారు. రాష్టప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని సూచిస్తూ వారికి ఓ నోట్ ను అందజేశారు.
సీఎం పిచ్చోడు... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై పాల్వాయి మరో మారు ద్వజమెత్తాడు.. ''వాడు ఓ పిచ్చోడు'' విభజనపై హద్దు మీరి సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నాడు. దీనికి త్వరలోనే తగిన మూల్యం కచ్చితంగా చెల్లిస్తాడని తెలిపారు. పోలవరం పై తెలంగాణ ప్రజలకు అభ్యంతరం లేదు. అయితే 1.35 లక్షల కుటుంబాలు 335గ్రామాలకు ఈ ప్రాజెక్టుతో ముప్పు పొంచి ఉంది 75 టిఎంసిల నీటి కోసం ఇంత ముప్పును కాదని ముందుకు వెల్ల రాదు. సాగునీటి రంగ నిపుణుడు హనుమంతరావు సూచించిన విధంగా మూడు బ్యారేజీలను నిర్మిస్తే నష్టం తక్కువగా ఉంటుంది. 130 గ్రామాలు మాత్రమే ముంపునకు గురౌతాయి. అని పాల్వాయి అన్నారు. నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు 5 గ్రామాలే ముంపునకు గురయ్యాయని చెప్పారు.


No comments:

Post a Comment