Friday, 1 November 2013

వెస్టిండీస్ సిరీస్ కు కుర్రాళ్లు...


ముంబై: వెస్టిండీస్ తో జరగనున్నటెస్టు సిరిస్ కు భారత జట్టును బుధవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్టులో మొత్తం కుర్రాలకు చోటు కల్పిస్తూ బిసిసిఐ టీం ను ప్రకటించింది. అయితే సచిన్, ధోనీ తప్పా ఈ సిరిస్ ఎవరూ టెస్టు అనుభవం లేక పోవడం విశేషం. అయితే వన్డేలోనూ దుమ్ము దులుపుతున్న కుర్రాళ్లు టెస్టుల్లోను ఏ విధంగా రాణిస్తారో చూడాలి...!
సెహ్వాగ్, గంభీర్ లకు దక్కని చోటు..
అయితే టెస్టు సిరిస్ కు భారత జట్టులోకి సీనియర్స్ ని తీసుకుంటారని అందరు భావించారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తు బిసిసిఐ టీం ను ప్రకటించింది. దీంతో భారత జట్టులోకి మళ్లీపునరాగమనం చేయాలనుకున్న సెహ్వాగ్ , గంభీర్ లకు నిరాషే మిగిలింది.
మరో సారి నమ్మకం...
ఇటీవల పేలవ ఫాం లేమితో భాద పడుతున్న ఇషాంత్ షర్మకు సెలక్టర్స్ మరో అవకాశాన్ని ఇచ్చారు. ఒక్క సారి విఫయమైనంత మాత్రాన ప్రతిభ ఉన్న ఆటగాళ్లను పక్కకు పెట్టాల్సిన పని లేదని బిసిసిఐ తెలిపింది. మరో ఆటగాడు రోహిత్ షర్మ ఇతను వన్డేలో ఓపెనర్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఇతను పై నమ్మక ముంచిన సెలక్షన్ కమిటి టెస్టులోను తన సత్తా చాటుకుంటాడని భావిస్తున్నారు.
సచిన్ కు చివరి టెస్టు సిరీస్ ...
ఇక సచిన్ సెలక్షన్ చేయడం సెలక్షన్ కమిటికి ఉండక పోవచ్చు సచిన్ ఈ సిరిస్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్తాడన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని దృష్టింలో పెట్టుకుని సెలక్షన్ కమీటీ మొత్తం యువకుల తో కూడిన జట్టును ప్రకటించింది . దీంతో మంచి ఫాం కొనసాగిస్తున్న కుర్రాలతో , ఇదే ఊపును టెస్టు సిరిస్ లో కొనసాగించి సచిన్ కు సగౌర్వంగా వీడ్కోలు పల్కాలని జట్టు యోచిస్తుంది .

జట్టు వివరాలు. ధోనీ( కెప్టెన్) ధావన్, రోహిత్ , పుజారా, సచిన్, కోహ్లీ, రహానే, విజయ్, భువనేశ్వర్, ఇషాంత్ , అశ్విన్, ఓజా, మిశ్రా, షమీ, ఉమేష్ యాదవ్.,

No comments:

Post a Comment