కోల్
కతా: ఐపిఎల్-6
లో40 లక్షల
రూపాయల మ్యాచ్ ఫిక్సింగ్ కు
పాల్పడిన శ్రీశాంత్,
ఆడబ్బు మొత్తం
ఏం చేస్తాడని మాజీ కెప్టెన్
సౌరప్ గంగూలీ అన్నారు..
బుధవారం
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో
పాల్గొన్న ఆయన ఫిక్సింగ్ పై
పలు సూచనలు చేశారు.
శ్రీశాంత్
ఫిక్సింగ్ పాల్పడ్డాడో!
లేదో!
తనకు తెలియదని
...ఒక
వేళ్ల ఆ పని చేసి ఉంటే నిజంగా
మూర్ఖత్వమే అవుతుందని
అభిప్రాయపడ్డారు.శ్రీశాంత్
డబ్బులే లక్ష్యంగా పెట్టుకుంటే
ఒక్క టెస్టు ఆడితే ఆ మొత్తం
వస్తుందన్నాడు. మూడు
టెస్టుల మ్యాచ్ లో ఇరవై వికెట్లు
తీసి ఉంటే దానికి డబుల్ రెట్లు
డబ్బు వచ్చేదని తెలిపాడు.
మరో వైపు
ఫిక్సింగ్ వ్యవహారం భారత
క్రికెట్ ను దెబ్బ తీయదని
అన్నాడు... ఒక
చెరువులో , లేదా
ఒక నదిలో మంచి చేపలు ఉంటాయి...
చెడు చేపలు
ఉంటాయి... కానీ
చెడు చేపల వల్ల ఆ నది మొత్తం
పాడు కాదు కదా....!అని
తెలిపారు. అదేవిదంగా
భారత్ క్రికెట్ వ్యవస్థలో
చాలా మంది మంచి వారు ఉన్నారు.
చెడ్డ వారు
ఉన్నారు. అంత
మాత్రాన క్రికెట్ వ్యవస్థ
దెబ్బ తినదని అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment