Friday, 30 August 2013

ఫైనల్లో వారియర్స్....


బెంగళూరు: ఐబిఎల్ రెండో సెమీ ఫైనల్ ముగిసింది. ఫైనల్స్ లో హైదరాబాద్ హాట్ షాట్ కు దీటైన ప్రత్యర్థిని నేనే అంటూ... అవధె వారియర్స్ రంగం సిద్ధం చేసుకుంది. అయితే గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్స్ లో ముంబై మాస్టర్స్ ను అవధె వారియర్స్ 3-2 చిత్తుగా ఓడించింది. మహిళల సింగిల్స్ లో యువతార సింధూ మరో సారి మెరిసింది. కళ్లు చెదిరే స్మాష్ లతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. 21-16, 21-13 తో వరుస గేమ్ ల్లో బాన్ పై విజయం సాధించింది. మరో వైపు పురుషుల సింగిల్స్ లో లీ చాంగ్ వీ (ముంబయి మాస్టర్స్)21-15,21-7తో గురు సాయిదత్ అవధె వారియర్స్ ను వరుస గేమ్ లల్లో ఓడించి జట్టుకు 1-0 అధిక్యాన్ని అంధించాడు. అయితే పురుషుల డబుల్స్ లో ముంబై మాస్టర్స్ ఓడిపోవడంతో ...2-2తో సమం చేశాడు . ఫలితం తేలే మిక్స్ డ్ డబుల్స్ లో కిడో-పియా గెలిచి అవధె వారియర్స్ ను ఫైనల్స్ కు చేర్చాడు..దీంతో శనివారం ముంబయిలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరో సారి దూకుడుగా.....

పివి సింధూ మరో సారి మెరిసింది. టిన్ బాన్ తో గేమ్ లో సింధూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి ఎత్తులను గమనిస్తూ... గ్రౌండ్ మొత్తం ఆడించింది. చక్కని ప్లేస్ మెంట్స్ ఆడుతూ..ప్రత్యర్థిని 21-13 తో రెండో గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా కైవసం చేసుకుంది

No comments:

Post a Comment