Friday, 30 August 2013

కీలక పోరునేడే...



మలేషియా: ఆసియా కప్ హాకీ లో, వరుస విజయాలు సాదిస్తున్న భారత్, మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్స్ లో భారత్ అథిత్య జట్టు మలేషియాతో తలపడ నుంది. పటిష్టమైన మలేషియాను ఓడించి భారత్ ఫైనల్లో అడుగు పెట్టాలని యోచిస్తుంది. దీనికి తోడు ఆసియా కప్ విజేతగా నిలిస్తే... వచ్చే ఏడాది ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తుంది.దీంతో భారత్ పై ఈ మ్యాచ్ లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది.. ఇప్పటికే పసికూన ఓమన్ ను 8-0తో చిత్తు చేసి, డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా పై 2-0తో అద్భుత విజయం సాధించింది. తరువాత బంగ్లాతో 9-1గోల్స్ చిత్తి చేసి సెమీ ఫైనల్స్ కు రెట్టింపు విశ్వాసం తో బరిలోకి దిగనుంది . ఇంకా రెండు మ్యాచ్ లు గెలిస్తే ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్న నేపథ్యంలో భారత్ కు విశ్రమించే అవకాశం లేదు. ముఖ్యంగా అనిశ్చితి కి మారు పేరయిన మలేషియాతో పోరు అంత సులభం కాదు. పైగా సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండడం మలేషియాకు కలిసొచ్చే అంశం.

టైటిల్ కొట్టక పోయినా..ఛాన్సుంది....


అయితే ఆసియా కప్ టైటిల్ సాధిస్తే భారత్ కు ప్రపంచ కప్ అర్హత సులభమవుతుంది. కానీ భారత్ టైటిల్ సాధించక పోయిన మరో మార్గంలో ఛాన్స్ ఉంది. ఇప్పటికే దక్షిణ కొరియా, ప్రపంచ కప్ కు అర్హత సాధించగా... మలేసియా కూడా సమాఖ్య ద్వారా అర్హత లాంచనంగా మారింది. అయితే ఈ రెండు జట్లల్లో ఏ జటైనా కప్ సాదిస్తే... మళ్లీ ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి. దీంతో ఇప్పటికే అర్హత సాధించన జట్లు ఈ రెండు కావడంతో వాటి స్థానాలు ఖాళీ అవుతాయి..దీంతోప్రపంచ కప్ ఫార్మాట్ ప్రకారం వరల్డ్ హాకీ లీగ్ సెమీ ఫైనల్స్ లో ఆరో స్థానంలో నిలవడం ద్వారా నాలుగో రిజర్వ్ గా ఉన్న భారత్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ కూడా ఉంది. ఈ టోర్నిని మాత్రం పాకిస్తాన్ గెలుగుకు పోతే భారత్ ఆశలు నీరు గారినట్టే.....

No comments:

Post a Comment