Wednesday, 11 September 2013

సత్తా చాటేందుకు మరో చాన్స్...



విశాఖ: ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లు యువరాజ్, సెహ్వాగ్, గంభీర్, జహీర్ ఖాన్, తమ సత్తా చాటేందుకు మరో చాన్స్ రానుంది... సొంత గడ్డపై వెస్టిండీస్ -ఎ తో జరగనున్న అనధికార టెస్టు, వన్డే, మ్యాచ్ లకోసం ఈస్టార్ ఆటగాళ్లకు మరో చాన్స్ ఇవ్వాలని బిసిసిఐ బావించింది. దీనిలో భాగంగా... మొత్తం మూడు టెస్టులకు గానూ, రెండు టెస్టులకు గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ లకు ఎంపిక చేశారు. మూడు టెస్టులకు గానూ కాశ్మీర్ అల్ రౌండర్ పర్వేజ్ రసూల్ ఒక్కడే ఎంపికయ్యారు. వన్డే జట్టు కెప్టెన్ గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ సిరీస్ లు ఇప్పుడు సెప్టెంబర్ 15నుంచి 21వరకు బెంగళూరు లో జరగనున్నాయి. అదే నెల 25నుంచి అక్టోబర్ 12 వరకు మైసూర్ షిమోగా, హుబ్లీలలో జరగనున్నాయి.  

No comments:

Post a Comment