ఇస్లామాబాద్:
భారత్ పాకిస్తాన్
మ్యాచ్ లు లేకపోవడంతో పాకిస్తాన్
బోర్డు ఆర్థికంగా భారీగా
నష్ట పోయింది. భారత్
పాకిస్తాన్ మ్యాచ్ లంటే
అభిమానులకు ఎప్పుడు పండగే...
అయితే ముంబై
బాంబు పేలుళ్ల తర్వాత ఆ
దేశంతోగానీ ఆ దేశ వేదికలపై
ఆడవద్దని భారత క్రికెట్ బోర్డు
నిర్ణయించింది. దీంతో
2008 నుంచి
పాకిస్తాన్ ద్వైపాక్షిక
సిరీస్ లు జరగలేదు. దీంతో
పాకిస్తాన్ బోర్డు కు భారీగా
నష్టం వాటిళ్లిందని ఆ దేశం
క్రికెట్ బోర్డు వెళ్లడించింది.
గత డిసెంబర్
లో భారత పర్యటనలో ఎలాంటి
లాభాపేక్ష లేకుండా సిరీస్
ఆడామని ఆ తర్వాత కనీసం తటస్ట
వేదికలపై అయినా సిరీస్ ఆడదామంటూ
ప్రతిపాదించినా భారత్ నుంచి
స్పందన రాలేదని వివరించారు.
ద్వైపాక్షిక
సిరీస్ ఆడేందుకు భారత్
తిరస్కరించడం వల్ల ప్రసార
కర్త దుబాయ్ కు చెందిన తాజ్
ఎంటర్ టైన్ మెంట్ నెట్ వర్క్
చానెల్ కు పిసిబి 10.5కోట్లు
చెల్లించాల్సిఉంటుంది.
No comments:
Post a Comment